Home » Manipur
మణిపూర్లో ఘర్షణలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. కుకీ-నాగా, కుకీ-పెయిటీ, కుకీ-మెయిటీ తెగల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఫలితంగా వందలాది గ్రామాలు బూడిద కుప్పలవుతాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతోపాటు, వందలాది మంది గాయపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరు కొన్ని నెలల తరబడి హింసను కొనసాగిస్తూ ఉంటారు.
దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలకు కారణమైన మణిపూర్ మహిళల నగ్న వీడియో వెనుక కుట్ర ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఈ వీడియోను విడుదల చేసి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన మణిపూర్ మహిళల నగ్నంగా ఊరేగించి, అత్యాచారం వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలను నిగ్గు తేల్చాలని ఆదేశించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) గురువారం తీవ్ర విమర్శలు గుప్పించారు. తన భావజాలమే మణిపూర్ను తగులబెడుతోందని ఆయనకు బాగా తెలుసునని, అందుకే ఆయన నోరు విప్పడం లేదని ఆరోపించారు.
మణిపూర్లో మే 3న ప్రారంభమైన హింసాత్మక ఘర్షణలు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి, గురువారం ఉదయం బిష్ణుపూర్ సమీపంలోని మొయిరంగ్లో రెండు వర్గాల మధ్య తుపాకులతో ఘర్షణ జరిగింది. కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. ఈ గ్రామంలో చాలా ఇళ్లను తగులబెట్టారని తెలిపారు.
ప్రతిపక్ష కూటమి ఇండియా నేతల బృందం త్వరలో మణిపూర్ సందర్శించబోతోంది. ఈ రాష్ట్రంలో బలంగా ఉన్న పార్టీ ఈ బృందానికి నాయకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమి ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే.
మోదీ సర్కారుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలోని 26 పార్టీల కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ ఆమోదించారు. దీంతో.. త్వరలోనే అవిశ్వాస తీర్మానంపై చర్చకు రంగం సిద్ధం కానుంది.
మణిపూర్(Manipur)లో హింసాకాండ కొనసాగుతోంది. బుధవారం మోరె జిల్లాలో ఒక మూక 30ఇళ్లు, దుకాణాలను దహనం చేసింది. నివారించటానికి వచ్చిన సాయుధ దళాలపై తుపాకులతో కాల్పులకు తెగబడింది.
ఆమె సాధారణ మహిళ.. మణిపూర్ రాజధాని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని సూపర్ మార్కెట్లో షాపింగ్కు వెళ్లింది.
జాతుల ఘర్షణతోనే అట్టుడుకుతున్న మణిపూర్(Manipur)లో మరో సమస్య..! పొరుగు దేశం మయన్మార్(Myanmar) ప్రజలు రాష్ట్రంలోకి భారీగా చొరబడ్డారు.