Home » Ponnam Prabhakar
ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. నెత్తిన బోనమెత్తి వచ్చిన ఆడబిడ్డలు, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో లష్కర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
సికింద్రాబాద్: ఉజ్జయని మహంకాళీ అమ్మవారి బోనాలు ఆదివారం తెల్లవారుజామున ధూమ్ దాంగా ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి క్యూ కట్టారు. తెల్లవారుజామున అమ్మవారికి ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్చార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు.
కేంద్రమంత్రి బండి సంజయ్కు(Bandi Sanjay) తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మరోసారి సవాల్ విసిరారు. రైతులకు రుణమాఫీ 70 శాతం మందికి వర్తించడం లేదని బండి సంజయ్ అన్నారని.. అది నిరూపించకపోతే తన పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి, ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర బడ్జెట్లో తగినంత కేటాయింపులు జరిగేలా చూడాలని కేంద్ర మంత్రి బండి సంజయ్కి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay)కు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) బహిరంగ లేఖ రాశారు. కేంద్ర క్యాబినేట్లో స్థానం దక్కించుకున్నందుకు ముందుగా బండి సంజయ్కు పొన్నం శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం నిధులు కేటాయించేలా చూడాలని లేఖలో కోరారు.
హైదరాబాద్లో భారీ వర్ష సూచనలపై ప్రభుత్వం హైఅలెర్ట్ ప్రకటించింది. హైదరాబాద్లో ఈ సాయంత్రం నుంచి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
బీఆర్ఎస్ నుంచి కాంగ్రె్సలోకి వచ్చే ఎమ్మెల్యేలందరూ స్వచ్ఛందంగా ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే చేరుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
పంచాయతీరాజ్ శాఖకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఎట్టి పరిస్థితుల్లో ఆగే పరిస్థితి తలెత్తకూడదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పాలని అడిగారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ క్రమంలో రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.
ఆర్టీసీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణా, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల నుంచి హైదరాబాద్కు అతి త్వరలో ఏసీ బస్సులు నడుపుతామని ప్రకటించారు.