Home » Rammohannaidu Kinjarapu
Rammohan Naidu: బీసీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పంచాయతీ మెట్లు ఎక్కలేని బీసీలను పార్లమెంటు మెట్లు ఎక్కేలా టీడీపీ అవకాశం ఇచ్చిందని అన్నారు. ఎన్టీఆర్ వేసిన పునాదులను పటిష్టం చేసేలా చంద్రబాబు పని చే'స్తున్నారని చెప్పారు. బీసీలకు ఏదైనా కొత్త పథకం ప్రారంభమైందంటే అది కేవలం టీడీపీ హయాంలోనే అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Rajahmundry Airport: రాజమండ్రి ఎయిర్పోర్టులో కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొంత మంది కార్మికులు స్టీల్ స్ట్రెక్చర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక స్టీల్ స్ట్రక్చర్ కిందకు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం.
దావోస్లో ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్ను కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్టు నిర్మించ తలపెట్టిన నేపథ్యంలో అక్కడ అధ్యయనం జరిపేందుకు కేంద్రం నిర్ణయించింది.
Ram Mohan Naidu Kinjarapu: జలజీవన్ మిషన్, హౌసింగ్ పథకాల్లో అధికారిక లెక్కలకు క్షేత్ర స్థాయి పనులకు పొంతన లేదని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. నాటి ప్రభుత్వ వైఫల్యాలు నేటికీ వెంటాడుతున్నాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ వాహనదారులకు గుడ్ న్యూస్. ఆ హైవే విస్తరణ పనులు త్వరలో మొదలవనున్నాయి. ఆరు లైన్లుగా ఆ హైవేను విస్తరించనున్నారు. దీంతో హైవే కాస్తా హైస్పీడ్వేగా మారనుంది.
న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో మరో ఎయిర్ పోర్ట్ నిర్మించాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక చేపడుతున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం సంస్కృతి, సంప్రదాయం కోసం పని చేస్తుందని తెలిపారు. మూడు రోజుల పాటు కృష్ణా, కర్ణాటక ఫెస్టివల్ జరగబోతుందన్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు హాజరుకానున్నారని వెల్లడించారు.
ఢిల్లీ పర్యటన కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సోమవారం హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఉదయం కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభకానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు.. పార్టీ ఎంపీలతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా .. ఈ సమావేశాల్లో అనుసరించ వలసిన వ్యూహాంపై పార్టీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.