Home » T20 World Cup 2024
టీ20 వరల్డ్ కప్ 2024ను ముద్దాడిన టీమిండియా ఆటగాళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ కాల్ చేసి మాట్లాడారు. ప్రపంచ కప్ను సాధించిన ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. ఇక రెండున్నరేళ్ల పాటు టీమ్ ఇండియా ప్రధాన కోచ్గా కొనసాగిన రాహుల్ ద్రవిడ్కు ప్రధాని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
టీమిండియా తరఫున దాదాపు 15 ఏళ్ల పాటు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడిన రాహుల్ ద్రవిడ్ కెరీర్లో చేదు జ్ఞాపకం 2007 ప్రపంచకప్. వెస్టిండీస్లో జరిగిన ఆ ప్రపంచకప్లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్సీలోని టీమిండియా గ్రూప్ దశను కూడా దాటలేకపోయింది.
క్రికెట్ ప్రపంచకప్ లేదా ఏదైనా అంతర్జాతీయ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో తరచూ వివాదాలు చూస్తుంటాం. అంపైర్ల నిర్ణయాలపైన లేదా ఆటగాళ్ల తీరుపై విమర్శలు వస్తుంటాయి.
దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ టీమిండియా ప్రపంచకప్ను ముద్దాడింది. కోట్లాది మంది అభిమానులను సంతోషంలో ముంచెత్తుతూ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్తో టీమిండియా దిగ్గజాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ టీ-20 కెరీర్లకు స్వస్తి పలికారు.
టీ20 ప్రపంచకప్ సాధించి ఎంతో మంది భారతీయుల కలలు నెరవేర్చిన టీమిండియాపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. క్రికెట్ అభిమానులు, మాజీ ఆటగాళ్లు మాత్రమే కాకుండా సినీ, రాజకీయ, పారిశ్రామిక దిగ్గజాలు కూడా సోషల్ మీడియా ద్వారా రోహిత్ సేనను అభినందిస్తున్నారు.
ఐపీఎల్ 2024(T20 World Cup 2024)లో అనేక విమర్శలు ఎదుర్కొన్న తర్వాత హార్దిక్ పాండ్యా(Hardik Pandya) టీ20 ప్రపంచ కప్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో పాండ్యా, లేదా టీమిండియాకు పాండ్యా భార్య నటాషా శుభాకాంక్షలు తెలిపిందా లేదా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఆమె ఎలా రియాక్ట్ అయ్యిందో ఇక్కడ తెలుసుకుందాం.
టీ20 ప్రపంచకప్ 2024ను భారత్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ప్రియాంకా గాంధీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఐసీసీ టైటిల్(T20 World Cup 2024) కోసం 11 ఏళ్ల నిరీక్షణకు భారత్(bharat) ముగింపు పలికింది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తోపాటు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) చాలా ఎమోషనల్ అయ్యారు. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడిని జయించిన టీమిండియా విజేతగా నిలిచింది. ఒత్తిడిని తట్టుకోలేకపోయిన దక్షిణాఫ్రికా విజయం ముందర బోల్తాపడింది. దక్షిణాఫ్రికా గెలుపు ఖాయమనుకున్న దశలో మ్యాచ్ టర్న్ అయింది.
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024(T20 World Cup 2024) ట్రోఫీని టీమిండియా గెలుచుకున్న తర్వాత స్టార్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో T20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించారు.