Home » TDP
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. హోంశాఖ, రవాణ, యువజన సర్వీసుల శాఖలపై ఆయన సమీక్షిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చలు జరుపుతారు. ఆస్పత్రులలో గొడవలు జరగకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రతపై సీఎం సమీక్ష జరుపుతారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎన్నికల సమయంలో ఘర్షణల కారణంగా టీడీపీ, వైసీపీ ముఖ్య నేతలను పోలీసులు పట్టణానికి దూరంగా ఉంచారు.
దేశంలోనే అతి పెద్ద చేనేత పరిశ్రమగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ లేనంతగా నేతన్నలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలో తమ సేవలను భారీగా విస్తరించేందుకు హెచ్సీఎల్ సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక అమలుకు అడుగులు వేస్తున్నట్లుగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా రూపొందించేలా ప్రపంచంలోనే విభిన్నమైన పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి చేయూతనిచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ శవం కనిపించినా గద్దల్లా వాలిపోయి వైసీపీ నేతలు శవరాజకీయాలకు తెరతీస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ(MLC Panchumarthi Anuradha) ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతదేహం సాక్షిగా పుట్టిన పార్టీ వైసీపీ అని ఆమె అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా తాను ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు ఇప్పుడు ఫలితాలిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. 2014-19లో తాను సీఎంగా ఉన్నప్పుడు నాలుగేళ్లపాటు సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె్స-ఈవోడీబీ)లో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందని గుర్తుచేశారు.
మహిళల ఆత్మగౌరవం, భద్రత, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు శుభాకాంక్షలు తెలిపారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో రవాణా శాఖలో భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని, వాటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిగ్గు తేలుస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. సోమవారం ఆయన ఇక్కడ టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.