Home » TG Govt
అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ హామీలను పూర్తిగా విస్మరించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి మండిపడ్డారు.
తొలి విడత రుణమాఫీ నిధులను ఈనెల 18 తేదీన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం... రెండో విడత నిధులను ఈనెల 31వ తేదీన విడుదలచేసే అవకాశాలున్నాయి. రూ.లక్ష వరకు అప్పున్న రైతులకు రూ. 6,099 కోట్లు విడుదలచేయగా లక్షన్నర వరకున్న అప్పులు మాఫీచేయటానికి మరో రూ.7 వేల కోట్ల నిధులు అవసరమవుతున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయడం లేదని, కేసీఆర్ హయాంలో కంటే.. రేవంత్ ప్రభుత్వంలోనే పోలీసులు రెచ్చిపోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కమ్మ అంటేనే కష్టపడే గుణం ఉన్నవారు.. అమ్మలాంటి ఆప్యాయత కలిగినవారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. కమ్మవారు నేలను నమ్ముకుని కష్టపడి పనిచేస్తారని అన్నారు.
హైదరాబాద్ను విశ్వనగరంగా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. వచ్చే పదేళ్లలో హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. గోపనపల్లి ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష లోపు రుణమాఫీపై క్షేత్ర స్థాయిలో కొంత గందరగోళం నెలకొంది. రుణమాఫీ జాబితాలో పేరు ఉండి.. మాఫీ సొమ్ము ఖాతాలో పడనివారు కొందరైతే, మాఫీకి అర్హత ఉండి జాబితాలో పేరు రానివారు మరికొందరు గందరగోళానికి గురవుతున్నారు.
మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) పేర్కొన్నారు.
స్కిల్ యూనివర్సిటీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీ సంబంధించిన పలు విషయాలపై అధికారులతో ఈరోజు(శుక్రవారం) సమావేశం అయ్యారు.
కేంద్రమంత్రి బండి సంజయ్కు(Bandi Sanjay) తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మరోసారి సవాల్ విసిరారు. రైతులకు రుణమాఫీ 70 శాతం మందికి వర్తించడం లేదని బండి సంజయ్ అన్నారని.. అది నిరూపించకపోతే తన పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రుణమాఫీ(Runa Maffi) పథకానికి గురువారం శ్రీకారం చుట్టింది. రెండు లక్షల లోపు బ్యాంకు రుణాలున్న రైతులకు ఏక మొత్తంలో మాఫీ చేస్తామన్న ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకుంది.