Home » TG Govt
తెలంగాణలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ విజయవంతంగా కొనసాగుతోంది. యూఎస్లోని ప్రముఖ కంపెనీల అధినేతలు, ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విచారణలో భాగంగా ఈనెల 16వ తేదీన జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్కు రానున్నారు. దాదాపు 20 రోజుల పాటు హైదరాబాద్లోనే మకాం వేసి, విచారణ ప్రక్రియను చేపట్టనున్నారు.
భూసేకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
నీటి పారుదల శాఖలో టీజీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల (ఏఈఈ) నియామక ప్రక్రియ చేపడుతుండటంతో వారు సర్వీసులో చేరేదాకా వివిధ శ్రేణుల్లో పనిచేస్తున్న 34 మంది ఉద్యోగుల సర్వీసును కొనసాగించాలని సంబంధిత శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ప్రస్తుత ఖరీఫ్ (వానాకాలం) సీజన్లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 98,570 ఎకరాలకు సాగు నీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
నేషనల్ హైవేలను త్వరగా పూర్తి చేయాలని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ (Etala Rajender) తెలిపారు. గురువారం నాడు పార్లమెంటులో పలు కీలక విషయాలపై ఈటల మాట్లాడారు.
బీఆర్ఎస్పై కొంతమంది కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది పార్టీ పని అయిపోయిందని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అదేశించారు. వర్షాకాలం సీజన్ను దృష్టిలో పెట్టుకుని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా బీర్ల ధరలు పెరగనున్నట్టు తెలిసింది. బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు(బ్రూవరీల) ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తున్న ధరలను 10 నుంచి 12 మేర పెంచాలని నిర్ణయించినట్టు సమాచారం.
తెలంగాణకు పెట్టుబడులు సాధించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అమెరికా పర్యటన విజయవంతంగా సాగుతోంది. మంగళవారం న్యూయార్క్ పర్యటనలో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఆయన సమావేశమయ్యారు.