Home » West Indies Cricketers
‘మా ఆటగాళ్లకు తగిన మ్యాచ్ ప్రాక్టీస్ లభించాలనేదే మా ఉద్దేశం. ఇందుకోసం వీలైనప్పుడల్లా అవకాశాలిస్తుంటాం’.. తొలి వన్డే ముగిశాక కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలివి.
టెస్టు సిరీస్(Test series) మాదిరిగానే వన్డేల్లోనూ(ODI) టీమిండియా(Team India ) శుభారంభం చేసింది. అటు ఫార్మాట్ మారినా విండీస్(Windies) ఆటతీరు మాత్రం ఎప్పటిలాగే సాగింది.
తొలి టెస్టుల్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా యషస్వీ జైశ్వాల్, ఇషాన్ కిషన్ అరంగేట్రం చేస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. ఈ మ్యాచ్లో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్కు తుది జట్టులో స్థానం దక్కలేదు.
మొదటి టెస్ట్ మ్యాచ్కు తుది జట్టును ఎంపిక చేయడం టీమిండియా మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఓపెనింగ్లో రోహిత్కు జతగా ఎవరిని ఆడించాలి? వికెట్ కీపింగ్ బాధ్యతలను ఎవరి అప్పగించాలి? స్పిన్ డిపార్ట్మెంట్లో ఎవరినీ బెంచ్కు పరిమితం చేయాలనే అంశంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ తర్జన భర్జన పడుతున్నారని సమాచారం.
వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు (India tour of West Indies 2023) 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నెల నుంచి 12 నుంచి 16 మధ్య జరగనున్న మొదటి టెస్ట్ మ్యాచ్ డొమినికా వేదికగా జరగనుంది. ఇక 20 నుంచి 24 మధ్య ట్రినిడాడ్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్నాయి.
భారత్, వెస్టిండీస్ (West Indies vs India) మధ్య ఈ నెల 12 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా బుధవారం నుంచి డొమినికా వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం భారత జట్టు ఇప్పటికే మ్యాచ్ వేదికైనా డొమినికా చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్లో భారత్, వెస్టిండీస్ మధ్య హెడ్ టూ హెడ్ రికార్డులు, రెండు జట్ల పోటీలో అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లు ఎవరో ఒక సారి పరిశీలిద్దాం.
ప్రస్తుతం వెస్టిండీస్(West Indies) పర్యటనలో ఉన్న భారత జట్టు(Team india) ఆల్టైమ్ గ్రేట్ సర్ ఆల్రౌండర్ గార్ఫీల్డ్ సోబర్స్ను (Sir Garry Sobers) కలుసుకుంది. అలనాటి విండీస్ దిగ్గజ ఆటగాడిన కలిసిన భారత ఆటగాళ్లు ఆయనతో కాసేపు ముచ్చటించారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ(BCCI) తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) కాసేపు కెమెరామెన్గా మారాడు. టీమిండియా (Team india) ఆటగాళ్లు బీచ్లో వాలీబాల్ ఆడుతుంటే ఇషాన్ కిషన్ వీడియో చిత్రీకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ(BCCI) తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించడంలో వెస్టిండీస్ విఫలమైంది. దీంతో ఆ దేశ మాజీ క్రికెటర్లు భావోద్వేగానికి గురవుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. శనివారం నాడు స్కాట్లాండ్పై వెస్టిండీస్ ఓటమి చెందడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో మాజీ క్రికెటర్లు ఇయాన్ బిషప్, డారెన్ సామీ, శామ్యూల్ బద్రీ, బ్రాత్వైట్ భావోద్వేగానికి గురై నిరాశగా కనిపించారు.
వెస్టిండీస్ పర్యటనకు సెలెక్టర్లు ఇలా టీమిండియా (Team India) స్క్వాడ్ను ప్రకటించారో లేదో ఇంతలోనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్కు (Sarfaraz Khan) సెలెక్టర్లు మరోసారి మొండి చెయ్యే చూపించడం పట్ల క్రికెట్ ప్రేమికులతోపాటు విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతకాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో (First Class Cricket) అదరగొడుతున్న సర్ఫరాజ్ ఖాన్ను టీమిండియాలోకి ఎంపిక చేయకపోవడానికి గల కారణమేంటని అభిమానులు నిలదీస్తున్నారు. అంతర్జాతీయ టెస్ట్ ఫార్మా్ట్లోకి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రాణించిన వారికి కాకుండా ఐపీఎల్లో (IPL) రాణించిన వారిని ఎంపిక చేశారని విమర్శిస్తున్నారు.