తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన పేషంట్.. వీధి రౌడీలా మారిన వైద్యుడు.. కనీసం కనికరం కూడా లేకుండా..

ABN , First Publish Date - 2022-03-19T01:46:51+05:30 IST

వైద్యో నారాయణో హరీ.! ఇది అందరికీ తెలిసిందే. వైద్యులు దేవుళ్లతో సమానం అంటారు కాబట్టే.. ఈ నానుడి వాడుకలోకి వచ్చింది. ప్రాణాపాయంలో ఉన్న రోగికి.. సమయం, సందర్భం అనే తేడా..

తీవ్రమైన కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన పేషంట్.. వీధి రౌడీలా మారిన వైద్యుడు.. కనీసం కనికరం కూడా లేకుండా..

వైద్యో నారాయణో హరీ.! ఇది అందరికీ తెలిసిందే. వైద్యులు దేవుళ్లతో సమానం అంటారు కాబట్టే.. ఈ నానుడి వాడుకలోకి వచ్చింది. ప్రాణాపాయంలో ఉన్న రోగికి.. సమయం, సందర్భం అనే తేడా లేకుండా ఎంతో ఓపికతో చికిత్స అందించి ప్రాణాలు పోస్తారు. ప్రాణాలు పోతాయనుకున్న క్షణంలో సరైన సమయానికి స్పందించి.. రోగులకు పునర్జన్మను ప్రసాదించిన వైద్యులను ఎంతో మందిని చూశాం. అలాంటి వైద్యులు ఉన్న నేటి సమాజంలోనే.. లేనిపోని అపోహలు చూపుతూ, రోగుల నుంచి డబ్బులు గుంజే వైద్యులూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వైద్యుడు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నట్టున్నాడు. ‘‘కడుపు నొప్పిని భరించలేకున్నాను.. డబ్బులు పోతే పోనీ మంచి చికిత్స అందించండి మహా ప్రభో!’’.. అంటూ ఆస్పత్రికి వచ్చిన రోగి పట్ల అతను ప్రవర్తించిన తీరు.. ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.


ఒడిశా రాష్ట్రం ధర్మఘర్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కలహండి జిల్లాకు చెందిన ముఖేశ్ నాయక్ అనే వ్యక్తికి గత ఆదివారం రాత్రి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. దీంతో లబోదిబోమంటూ ధర్మఘర్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి వెళ్లాడు. అయితే ఆ సమయంలో అక్కడ వైద్యులు ఎవరూ కనిపించలేదు. నర్సులు, కొంతమంది సిబ్బంది మాత్రమే ఉండడంతో వారికి సమస్య చెప్పుకొన్నాడు. కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో నర్సులను ప్రశ్నించాడు. అయినా వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. వైద్యులు ఎందుకు అందుబాటులో లేరంటూ ప్రశ్నించాడు. అదే సమయంలో డాక్టర్ శైలేశ్ కుమార్ అనే వైద్యుడు అక్కడికి వచ్చాడు. అప్పటికే కోపంతో ఊగిపోతూ అక్కడికి వచ్చిన వైద్యుడు.. కర్ర తీసుకుని ముఖేశ్‌ను చితకబాదాడు.

భార్యకు టిఫిన్ తినిపించి, లాడ్జికి తీసుకెళ్లిన భర్త.. కానీ మాట్లాడే క్రమంలో చివరకు ఇంత పని చేస్తాడనుకోలేదు..


దెబ్బలకు తాళలేక అతను అటూ, ఇటూ పరుగెత్తినా వైద్యుడు మాత్రం అతన్ని వదలకుండా వెంటబడి మరీ కొట్టడం ప్రారంభించాడు. అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు ఈ ఘటనను మొత్తం వీడియో తీశారు. వీడియో వైరల్ అవడంతో స్థానికులంతా అక్కడికి చేరుకుని ధర్నా చేశారు. వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని విచారించారు. ఈ విషయం చివరకు వైద్యశాఖ అధికారుల వరకూ వెళ్లింది. సదరు వైద్యుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

చెప్పిన పని ఎందుకు చేయలేదంటూ.. బాలిక ముఖంపై ఆవు పేడ పూసి మరీ.. ఆ యువకులు చేసిన పని..





Updated Date - 2022-03-19T01:46:51+05:30 IST