నీ ప్రవర్తన బాగోలేదన్న భర్త.. అయితే విడాకులు తీసుకోమన్న భార్య.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-03-12T00:31:28+05:30 IST

మనస్పర్థలు తలెత్తినా మళ్లీ కలిసిపోతే ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న మనస్పర్థలు.. చిలికి చిలికి గాలివానగా మారుతుంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య..

నీ ప్రవర్తన బాగోలేదన్న భర్త.. అయితే విడాకులు తీసుకోమన్న భార్య.. చివరకు ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

మనస్పర్థలు తలెత్తినా మళ్లీ కలిసిపోతే ఎలాంటి సమస్యలూ ఉండవు. కానీ కొన్నిసార్లు చిన్న చిన్న మనస్పర్థలు.. చిలికి చిలికి గాలివానగా మారుతుంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య తలెత్తే మనస్పర్థలు కొన్నిసార్లు చాలా దూరం వెళ్తుంటాయి. అనుమానం పెనుభూతమై చివరకు ప్రాణాలు తీసుకోవడమో, ప్రాణాలు తీయడమో.. చేస్తుంటారు. కర్ణాటకలో ఓ దంపతుల మధ్య తలెత్తిన మనస్పర్థలు.. చివరికి తీవ్ర వివాదానికి దారి తీశాయి. నీ ప్రవర్తన బాగోలేదంటూ భర్త గొడవపడ్డాడు. నా ప్రవర్తన నచ్చకపోతే విడాకులు తీసుకోండి.. అంటూ భార్య అనడంతో వివాదం చోటుచేసుకుంది. చివరికి ఏం జరిగిందంటే..


రాయచూరుకు చెందిన నీలకంఠ.. కర్ణాటక రాష్ట్రం శివాజీనగర్ హెచ్‌ఏఎల్‌ కాళప్ప లేఔట్‌లో భార్య నాగమ్మ, ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. విధుల్లో భాగంగా పొద్దుటి నుంచి రాత్రి వరకూ ఇంటికి వచ్చే వాడు కాదు. దీంతో ఇంటి పనులు, పిల్లల ఆలనాపాలనా మొత్తం నాగమ్మ చూసుకునేది. ఇన్నాళ్లు సంతోషంగా ఉన్న కుటుంబంలో ఇటీవల సమస్యలు తలెత్తాయి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. తరచూ వివిధ సాకులు చూపుతూ భార్యను వేధించేవాడు. ‘‘నేను ఇంట్లో లేని సమయంలో ఎవరితో మాట్లాడుతున్నావ్.. నీకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయ్.. చెప్పు’’.. అంటూ వేధించేవాడు. ‘‘నేను అలాంటి దాన్ని కాదు.. నాకు ఎవరితోనూ సంబంధాలు లేవు.. నన్ను నమ్మండి’’.. అంటూ ఎంత వేడుకున్నా నీలకంఠ మాత్రం వినిపించుకునేవాడు కాదు.

‘‘నా భర్త కిందపడిపోయాడు.. కాపాడండి’’ అంటూ కేకలు.. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన యువకుడు.. పోలీసుల విచారణలో ఏం తెలిసిందంటే..


సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన నీలకంఠ.. మళ్లీ భార్యతో ఇదే విషయమై గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన నీలకంఠ.. బెల్టు తీసుకుని ఒక్కసారిగా భార్య మెడకు బిగించి హత్య చేశాడు. అరుపులు, కేకలు విని చుట్టుపక్కల వారంతా అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నాగమ్మ విగతజీవిగా పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.

బస్సు రన్నింగ్‌లో ఉండగా.. సడన్‌గా స్పృహ తప్పిన డ్రైవర్.. అంతా భయాందోళనలో ఉండగా ఓ మహిళ పైకి లేచి..

Updated Date - 2022-03-12T00:31:28+05:30 IST