Home » Videos
పుణెలో ఉన్నట్టుండి భూమి కుంగింది. దీంతో మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ట్రక్కు భూమిలోకి కూరుకుపోయింది. ట్రక్కులో ఉన్న డ్రైవర్ బతుకుజీవుడా అంటూ బయటకొచ్చాడు.
వాతావరణంలో మార్పుల ప్రభావం వల్లనే రెండు తెలుగు రాష్ట్రాలు వరదలు, కరువు వంటి విపత్తులు ఎదుర్కొంటున్నాయి. అసాధారణ వాతావరణ పరిస్థితులతో దేశంలో అనేక రాష్ట్రాలు ఇదే తరహా ప్రమాదంలో ఉన్నాయని భారత వాతావరణ శాఖ విశ్రాంత డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేష్ వెల్లడించారు.
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నిర్ధారణ అయింది. దీనిపై నాటి సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. నాడు వినియోగించిన నెయ్యిని ల్యాబ్లో టెస్ట్ చేయించినట్లు వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే టీటీడీకి ల్యాబ్ లేదని టీడీపీ నాయకుడు వేమూరి ఆనంద సూర్య స్పష్టం చేశారు.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకోనున్నారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి దూళిపాళ్ల నరేంద్రపై విజయం సాధించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న జానీ మాస్టర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.
తిరుపతి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఆందోళనలు రేకెతిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్ దిష్టి బొమ్మలను హిందువులు తగలబెడుతున్నారు. హిందువాదులు సైతం ఈ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇదే అంశంపై సీబీఐ డైరెక్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. పంది కొవ్వు, ఆవు కోవ్వు కారణంగానే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం గత ప్రభుత్వంపై ఇదే తరహా ఆగ్రహం సర్వత్ర వెల్లువెత్తుతుందని సీబీఐ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు.
పల్నాడు జిల్లా: వినుకొండ నియోజకవర్గం, బొల్లాపల్లి మండలం, మూగచింతలపాలెంలో వైసీపీ శ్రేణలు రెచ్చిపోయారు. తెలుగుయువత నేత పోక వెంకట్రావు కారుకు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి వేళ ఇంటిముందున్న కారును ప్రత్యర్థులు వైసీపీ శ్రేణలు తగులబెట్టారు.
తిరుమల స్వామివారి ప్రసాదం విషయంలో మూడ్రోజులుగా జరుగుతున్న పరిణామాలు తీవ్రంగా కలచివేస్తున్నాయని శ్రీవారి మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అన్నారు. మహాపాపం జరిగిందని, అన్నం పెట్టే దేవుడికి రుచి, సుచిగా ఉండే నివేదనలు పెట్టకుండా దారుణంగా వ్యవహరించారని అన్నారు.
అమరావతి: మాజీ మంత్రి విడదల రజనీ తమను బెదిరించి, భయపెట్టి రూ. కోట్లు వసూలు చేశారంటూ హోంమంత్రి అనితకు ఫిర్యాదు అందింది. పల్నాడు జిల్లా, ఎడ్లపాడుకు చెందిన బాలాజీ స్టోన్ క్రషర్ భాగస్వామి నల్లపనేని చలపతిరావు ఈ మేరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. వారి తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు హోంమంత్రికి అందజేశారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకరరావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్ పోల్కు సీబీఐ లేఖ రాసింది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తికి సీబీఐ అనుమతి ఇచ్చింది.