Devineni Avinash నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు

ABN , First Publish Date - 2022-12-07T10:02:10+05:30 IST

వైసీపీ నేత దేవినేని అవినాష్ నివాసంలో ఐటీశాఖ అధికారుల తనిఖీలు ముగిశాయి.

Devineni Avinash నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు

విజయవాడ: వైసీపీ నేత దేవినేని అవినాష్ (IT Raids in YCP Leader devineni Avinash House) నివాసంలో ఐటీశాఖ అధికారుల తనిఖీలు ముగిశాయి. నిన్న ఉదయం ఆరు గంటల నుంచి ఈరోజు ఉదయం ఆరు గంటల వరకు సోదాలు జరిగాయి. హైదరాబాద్ లాండ్ డెవెలప్‌మెంట్ ఒప్పందంపై అవినాష్‌ను ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ... ఐటీ శాఖ అధికారులకు పూర్తిగా సహకరించినట్లు తెలిపారు. ఐటీశాఖ అధికారులు వారి వద్ద ఉన్న అఫిడవిట్ సమాచారం మేరకు తనిఖీలు చేశారని.. ఇది సాధారణంగా జరిగిన తనిఖిలు మాత్రమే అని అన్నారు. ‘‘మా జీవితం తెరిచిన తెల్ల పుస్తకం లాంటిది. ప్రజలే మా ఆస్తులు... మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు. దేవినేని కుటుంబ చరిత్ర ఏంటో ప్రజలందరికీ తెలుసు. ఐటి సోదాల్లో ఎటువంటి అక్రమాలు బయటపడలేదు. మాకు నిత్యం ప్రజల్లో ఉండడం... రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసు’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-07T10:02:11+05:30 IST