YuvaGalam: 69వ రోజుకు యువగళం పాదయాత్ర... లోకేష్‌ను ఎవరెవరు కలిసారంటే..

ABN , First Publish Date - 2023-04-13T09:36:12+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.

YuvaGalam: 69వ రోజుకు యువగళం పాదయాత్ర... లోకేష్‌ను ఎవరెవరు కలిసారంటే..

అనంతపురం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra)కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. లోకేష్ (Nara lokesh) ఎక్కడికి వెళ్లినా మహిళలు, అభిమానులు హారతులు పడుతూ స్వాగతాలు పలుకుతున్నారు. ప్రతీ విడిది కేంద్రంలో సెల్ఫీలు దిగుతూ అభిమానులు ఆప్యాయంగా పలకరిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. ప్రతీరోజు దాదాపు వెయ్యిమందితో యువనేత సెల్ఫీలు దిగుతున్నారు. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈరోజు రాయలచెరువు నుంచి 69వ రోజు యువగళం పాదయాత్ర (Lokesh YuvaGalam Padayatra)ను లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్‌ను తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్లు కలిశారు. తాడిపత్రిలో అధికార పార్టీ, పోలీసులు ఆధ్వర్యంలో జరుగుతున్న దౌర్జన్యాలను లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న తీరుని యువనేతకు మహిళా కౌన్సిలర్లు వివరించారు. డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి వైసీపీ కండువా కప్పుకొని టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలర్ల ఆవేదనపై లోకేష్ స్పందిస్తూ... ఇక్కడ జరుగుతున్న అరాచకాలు అన్ని తనకు తెలుసన్నారు. ఎవరిని వదిలిపెట్టనని... కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జ్యూడిషియల్ ఎంక్వయిరీ వేసి అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరూ ధైర్యంగా పోరాడుతున్నారు అంటూ కౌన్సిలర్లను లోకేష్ అభినందించారు.

మరోవైపు ఈరోజు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించనుంది. లోకేష్ పాదయాత్రను విజయవంతం చేసేందుకు టీడీపీ శ్రేణులు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2023-04-13T09:36:12+05:30 IST