Share News

Amaravati: మంత్రి రోజా నుంచి ప్రాణ హాని..: ప్రేమ జంట

ABN , First Publish Date - 2023-11-16T11:29:00+05:30 IST

అమరావతి: ఓ ప్రేమ జంట తమకు ప్రాణ హానీ ఉందంటూ, రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా, పుత్తూరుకు చెందిన ప్రవీణ, నెల్లూరుకు చెందిన జిలానీతో ఆరేళ్లుగా ప్రేమలో ఉంది.

Amaravati: మంత్రి రోజా నుంచి ప్రాణ హాని..: ప్రేమ జంట

అమరావతి: ఓ ప్రేమ జంట (Love Couple) తమకు ప్రాణ హానీ ఉందంటూ, రక్షణ కల్పించాలని పోలీసులను (Police) ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా, పుత్తూరుకు చెందిన ప్రవీణ (Praveena), నెల్లూరుకు చెందిన జిలానీ (Jilani)తో ఆరేళ్లుగా ప్రేమ (Love)లో ఉంది. ఇద్దరి మతాలు వేరు కావడంతో ప్రవీణ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించలేదు. ఆమెకు వేరే సంబంధాలు చూస్తుండటంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రవీణ మేజర్లు కావడంతో ప్రియుడు జిలానీని పెళ్లి చేసుకుంది. అయితే తమకు మంత్రి రోజా (Minister Roja) నుంచి ప్రాణ హాని ఉందని, పోలీసులు తమకు రక్షణ కల్పించకుండా మంత్రి ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఏమైనా జరిగితే.. మంత్రి రోజాదే బాధ్యతని అన్నారు. డీజీపీ (DGP) స్పందించి తమకు రక్షణ కల్పించాలని ప్రేమ జంట విజ్ఞప్తి చేసింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-11-16T11:29:01+05:30 IST