Lokesh YuvaGalam: 43వ రోజు లోకేష్ పాదయాత్ర ప్రారంభం

ABN , First Publish Date - 2023-03-15T10:51:34+05:30 IST

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం జిల్లాలోని తంబళ్లపలె నియోజకవర్గంలో కొనసాగుతోంది.

Lokesh YuvaGalam: 43వ రోజు లోకేష్ పాదయాత్ర ప్రారంభం

అన్నమయ్య: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (TDP Leader Nara lokesh YuvaGalam Padayatra)ప్రస్తుతం జిల్లాలోని తంబళ్లపలె నియోజకవర్గంలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం తంబళ్లపల్లె నియోజకవర్గం గుట్టపాలెం విడిది కేంద్రం నుంచి 43వ రోజు యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) ను లోకేష్ (Nara Lokesh) ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా సెల్ఫీవిత్ లోకేష్ (Sefy With Lokesh)కార్యక్రమంలో యువనేత (YuvaGalamLokesh) చురుకుగా పాల్గొంటున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా తనని కలవడానికి గుట్టపాలెం విడిది కేంద్రం వద్దకు వచ్చిన ప్రజలను ఉదయమే కలిసి వారితో లోకేష్ ఫోటోలు దిగారు. ప్రతీ రోజూ సుమారుగా వెయ్యి మందికి యువనేత సెల్ఫీ ఇస్తున్నారు. లోకేష్ (TDP Leader) ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు లోకేష్ 539.6 మేర పాదయాత్ర చేశారు. ఈరోజు 10.5 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఈరోజు ఉదయం ముందుగా గట్టు గ్రామంలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశమయ్యారు. 10:30 గంటలకు కొండకిందపల్లిలో స్థానికులతో మాటామంతీ నిర్వహించారు. అలాగే 11:15 గంటలకు బుచ్చిరెడ్డిపల్లి క్రాస్ వద్ద ముస్లిం సామాజికవర్గీయులతో ముఖాముఖిలో పాల్గొంటారు. బుచ్చిరెడ్డి పల్లి క్రాస్ వద్ద టమోటా రైతులతో లోకేష్ సమావేశం అవుతారు.

సాయంత్రం

3:45 - బి.కొత్తకోటలో స్థానికులతో మాటామంతీ.

4:05 - బి.కొత్తకోట వాసులతో సమావేశం.

5:30 - బి.కొత్తకోట ఇందిరమ్మకాలనీ విడిది కేంద్రంలో బస.

Updated Date - 2023-03-15T10:51:34+05:30 IST