Sriraj: చంద్రబాబుతో మాట్లాడతారనే కోడికత్తి శ్రీనును విశాఖకు తరలించారు
ABN , First Publish Date - 2023-09-13T14:00:35+05:30 IST
కోడికత్తి శ్రీను(Kodikatti Srinu) జైలులో చంద్రబాబుతో మాట్లాడతారనే భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి( CM Jagan Reddy) విశాఖ జైలుకు తరలించారని మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్(Sriraj) వ్యాఖ్యానించారు.
రాజమండ్రి: కోడికత్తి శ్రీను(Kodikatti Srinu) జైలులో చంద్రబాబుతో మాట్లాడతారనే భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి( CM Jagan Reddy) విశాఖ జైలుకు తరలించారని మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్(Sriraj) వ్యాఖ్యానించారు. బుధవారం నాడు రాజమండ్రిలో ఆయన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్ఐఏ కేసులో బీజేపీ, వైసీపీలు ఎయిర్ పోర్టులో సీసీ పుటేజ్ మాయం చేశారు. శ్రీనుకు రక్షణ కల్పించడంలో విఫలం అయ్యారని శ్రీరాజ్ మండిపడ్డారు.
శ్రీను దళితుడనే చిన్నచూపుతోనే...
దళితుడనే చిన్నచూపుతోనే కోడికత్తి శ్రీనును రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విశాఖకు తరలించారని కోడికత్తి శ్రీను సోదరుడు సుబ్బరాజు అన్నారు.కోడికత్తి శ్రీనును ఇప్పటికైనా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ తరలించారంటే శ్రీనుకు ప్రాణహాని ఉందనే భయం ఉంది. జగన్ ఇప్పటికైనా స్పందించి ఎన్వోసీ ఇవ్వాలని సుబ్బరాజు కోరారు.