AP Congress : ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల రాకపై AP PCC Chief ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-07-21T18:51:43+05:30 IST

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM Jagan) ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు (Gidugu-RudraRaju) విమర్శలు గుప్పించారు.

AP Congress : ఏపీ కాంగ్రెస్‌లోకి షర్మిల రాకపై AP PCC Chief ఆసక్తికర వ్యాఖ్యలు

విశాఖపట్నం: వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (CM Jagan) ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు (Gidugu-RudraRaju) విమర్శలు గుప్పించారు.


"జగన్ నడుపుతోంది నకిలీ కాంగ్రెస్. వైసీపీలో జగన్‌కు బానిసలుగా ఉన్నవారంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలి. కాంగ్రెస్ భావజాలాన్ని నచ్చే వారంతా పార్టీలోకి రావచ్చు‌. అదే క్రమంలో షర్మిల కూడా వచ్చే అవకాశాలున్నాయి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ 175 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుంది. ఏపీలో లీడింగ్‌లో ఉన్న పార్టీలు బీజేపీకి దగ్గరయ్యేందుకు ఉబలాటపడుతు‌న్నాయి. ఆయా పార్టీలు తమ రాజకీయ ఎజెండా ఏంటో చెప్పాలి. జగన్ పాలనపై బీజేపీ విమర్శలు చేయడం కాదు. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలతో నాలుగేళ్ల సీఎం జగన్ అవినీతిపై ఎందుకు విచారణ జరిపించడం లేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలు పాలిస్తోన్న వారికి ఒక న్యాయం, అంటగాకే పార్టీలకు ఒక న్యాయం ఎందుకని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అమరావతి రాజధానికి కట్టుబడి ఉంది‌. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయి. మూడు రాజధానులు ఎలా వస్తాయి. అమరావతే రాజధానిగా ఉండాలని చేస్తోన్న పోరాటానికి మద్దతు తెలిపేందుకు ప్రియాంక గాంధీ స్వయంగా వచ్చే అవకాశాలున్నాయి." అని గిడుగు రుద్రరాజు అన్నారు.


"కాంగ్రెస్ హయాంలో ప్రాణం పోసుకున్న స్టీల్ ప్లాంట్ ఎన్నో మైలురాళ్లు అధిగమించింది. ప్రైవేటీకరణ కాకుండా ఆపుతామని రాహుల్ గాంధీ ప్రకటించారు. 891 రోజులుగా జరుగుతోన్న పోరాటానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో ఉంది. రేపు జింక్ గేట్ నుంచి దీక్షా శిబిరం వరకూ ర్యాలీ నిర్వహించబోతున్నాం. రేపు మధ్యాహ్నం యూనియన్ లీడర్లతో సమావేశమవుతాం. అనతరం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ విశాఖ పర్యటన తేదీలను ఖరారు చేస్తాం. రాహుల్ గాంధీ ఆగస్టులో వచ్చే అవకాశాలున్నాయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం కూడా తాము పోరాడతాం."అని గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు.

Updated Date - 2023-07-21T19:30:10+05:30 IST