Share News

Nara Bhuvaneshwari: మిచౌంగ్ తుఫాను నష్టం ఆవేదన కలిగిస్తోంది

ABN , First Publish Date - 2023-12-05T22:29:09+05:30 IST

మిచౌంగ్ తుఫాను నష్టం ఆవేదన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

Nara Bhuvaneshwari: మిచౌంగ్ తుఫాను నష్టం ఆవేదన కలిగిస్తోంది

అమరావతి: మిచౌంగ్ తుఫాను నష్టం ఆవేదన కలిగిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ( Chandrababu Naidu ) సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari ) ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఆమె ఏమన్నారంటే.. ‘‘పెద్ద ఎత్తున ప్రజల ఆస్తి, పంట నష్టం బాధ కలిగిస్తోంది. చేతికొచ్చిన పంట నీటి పాలైన రైతన్నల బాధ వర్ణనాతీతం. తీవ్ర తుఫాను తాకిడికి నిలువ నీడలేక, ఆహారం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడటం బాధాకరం. ఎప్పుడు విపత్తు వచ్చినా సాయం చేయడంలో ముందుండే @ntrtrust ఈ సారి కూడా తన వంతు సాయానికి సిద్ధమైంది. సాధ్యమైనంత త్వరగా ఆపన్నులకు ట్రస్ట్ ద్వారా సాయం చేస్తాం. చేతనైన సాయంతో ఊరట కల్పిస్తాం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలి’’ అని నారా భువనేశ్వరి కోరారు.

Updated Date - 2023-12-05T22:29:54+05:30 IST