Nara Brahmani: ఆ సంఘటన దిగ్భ్రాంతి కలిగిస్తోంది

ABN , First Publish Date - 2023-09-26T19:12:34+05:30 IST

ఏపీలో శాంతియుతంగా అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీని నిర్వహిస్తుంటే.. ఈ ర్యాలీల్లో పోలీసులు మహిళలను వేధింపులకు గురి చేయడాన్ని తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందని నారా బ్రాహ్మణి(Nara Brahmani) వ్యాఖ్యానించారు.

Nara Brahmani: ఆ సంఘటన దిగ్భ్రాంతి కలిగిస్తోంది

అమరావతి: ఏపీలో శాంతియుతంగా అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీని నిర్వహిస్తుంటే.. ఈ ర్యాలీల్లో పోలీసులు మహిళలను వేధింపులకు గురి చేయడాన్ని తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోందని నారా బ్రాహ్మణి(Nara Brahmani) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో బ్రాహ్మణి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కష్టపడి పనిచేసే అంగన్‌వాడీ కార్యకర్తలు కోరుకునేది ఎన్నికల హామీలను నెరవేర్చాలని మాత్రమే. న్యాయo కోసం పోరాడుతున్న అంగన్వాడీ మహిళల పట్ల దురుసు ప్రవర్తన ఎంతవరకు సమంజసం? రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి.. ఏపీ వర్సెస్ జగన్‌గా ఉంది. రాష్ట్రంలో ప్రజలంతా చంద్రబాబు వెంటే ఉన్నారు’’ అని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T19:12:34+05:30 IST