AP News: కడపలో వైసీపీ ఎమ్మెల్యే భూమన వర్గీయుల అరాచకం

ABN , First Publish Date - 2023-06-12T10:49:15+05:30 IST

జిల్లాలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వర్గీయులు అరాచకానికి పాల్పడ్డారు. రాజంపేట మన్నూరుకు చెందిన మణి అనే వ్యక్తిని వైసీపీ శ్రేణులు గత అర్థరాత్రి కిడ్నాప్ చేసి ఆపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

AP News: కడపలో వైసీపీ ఎమ్మెల్యే భూమన వర్గీయుల అరాచకం

కడప: జిల్లాలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి (YCP MLA Bhuma Karunakar Reddy)వర్గీయులు అరాచకానికి పాల్పడ్డారు. రాజంపేట మన్నూరుకు చెందిన మణి అనే వ్యక్తిని వైసీపీ శ్రేణులు గత అర్థరాత్రి కిడ్నాప్ చేసి ఆపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వైసీపీ శ్రేణుల కిడ్నాప్‌పై బాధితుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. రాపూరు అడవులవైపు రెండు కార్లలో తీసుకెళ్తుండగా చిట్వేల్‌లో స్థానిక పోలీసులు పట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని చిట్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందజేశారు. కిడ్నాపర్లను రాజంపేట పోలీసులకు చిట్వేల్ పోలీసులు అప్పగించారు. మణిని కిడ్నాప్ చేసింది తిరుపతికి చెందిన 14 మంది వైసీపీ శ్రేణులని రాజంపేట పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే అసలు విషయం ఏంటంటే.. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడని మణి అనే వ్యక్తిని భూమన అనుచరులు కిడ్నాప్ చేసి దారుణంగా హింసించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-06-12T10:49:15+05:30 IST