Share News

Kanti Rana Tata: శ్యామ్ కుమార్‌పై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశాం

ABN , First Publish Date - 2023-11-04T22:01:55+05:30 IST

కంచికచర్ల దళిత యువకుడు శ్యామ్ కుమార్‌పై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశామని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ( Kanti Rana Tata ) తెలిపారు.

Kanti Rana Tata: శ్యామ్ కుమార్‌పై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశాం

విజయవాడ: కంచికచర్ల దళిత యువకుడు శ్యామ్ కుమార్‌పై దాడి కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశామని ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ( Kanti Rana Tata ) తెలిపారు. శనివారం నాడు కమిషనర్ కాంతి రాణా మీడియాతో మాట్లాడుతూ..‘‘కాలేజ్ చదువుకునే రోజుల్లో ఉన్న పాత కక్షలే ఈ దాడికి కారణం. దళిత యువకుడిపై దాడి చేసినవారంతా కూడా ప్రకాశం జిల్లా, గణపవరంకు చెందిన హరీష్‌రెడ్డి, అతని స్నేహితులే. కంచికచర్లలో ఇంజనీరింగ్ కాలేజీలో సర్టిఫికెట్స్ తీసుకొని శ్యామ్ కుమార్‌ని పని ఉందంటూ పిలిపించి కారులో ఎక్కించుకొని యువకుడిని తిప్పుతూ కొట్టారు. నిందితులపై కిడ్నాప్ , ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌తో పాటు, 363, 323, 326, 386, R/W 34ఐపీసీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశాం. ఈ సెక్షన్స్ కింద 10 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసుతో పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నమోదు చేశాం. 307 వర్తించదు కాబట్టి ఆ సెక్షన్ నమోదు చేయలేదు. నిందితులను ఈరోజు కోర్టులో ప్రవేశపెడతాం’’ అని కాంతిరాణాటాటా తెలిపారు.

Updated Date - 2023-11-04T22:01:56+05:30 IST