Kotam Reddy Sridhar Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశాక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలివీ..

ABN , First Publish Date - 2023-03-23T12:53:38+05:30 IST

అమరావతి: ఏపీలో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాల (MLA Kota MLC Elections)కు గురువారం పోలింగ్ జరుగుతోంది.

Kotam Reddy Sridhar Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశాక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలివీ..

అమరావతి: ఏపీలో ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాల (MLA Kota MLC Elections)కు గురువారం పోలింగ్ జరుగుతోంది. వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్థులో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేశానన్నారు. ఎవరికి ఓటు వేశానో చెప్పటం ధర్మం కాదన్నారు. ఆ ప్రశ్న మీడియా అడగకూడదని, తాను చెప్పకూడదని అన్నారు. అలాగే ఎవరు ఎవరికి ఓటు వేశారో తనకు ఏం తెలుస్తుందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకున్నానని స్పష్టం చేశారు.

సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మొత్తం ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడుగురు వైసీపీ, ఒకరు టీడీపీ అభ్యర్థి బరిలో ఉన్నారు. ఈ క్రమంలో పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ నేతలు... ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-03-23T13:28:41+05:30 IST