Home » MLC Elections
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురు సభ్యులూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్నాయక్; సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం; బీఆర్ఎస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్కుమార్ ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన ఎమ్మెల్యీ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు చివరికి ఏకగ్రీవం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ పార్టీలకు చెందిన 10 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా.. అభ్యర్థులంతా ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
MLC nomination process: రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ పర్వం ముగిసింది. తెలంగాణలో ఐదుగురు అభ్యర్థులు, ఏపీలో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
ఎమ్మెల్సీ పదవిపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కామెంట్స్ చేశారు.పదవి రానంత మాత్రాన బాధ పడనని.. తనకు న్యాయం చేయడానికి చంద్రబాబుకు ఎప్పుడు ప్రయత్నిస్తారని, చంద్రబాబుతో తన ప్రయాణం 23 ఏళ్లుగా కొనసాగుతోందని వర్మ పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మిత్రధర్మంలో భాగంగా ఆ పార్టీకి ఇచ్చింది. మొత్తంగా ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీతోపాటు ఒక మహిళకు అవకాశం కల్పించింది.
తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల ఢిల్లీ పర్యటన రద్దయింది. తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కెసీ వేణుగోపాల్ ఢిల్లీ నుంచి ఫోన్లో రాష్ట్ర నేతలతో సమాలోచనలు చేయనున్నారు.
తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ పదవుల కోసం ఆశావహుల జాబితా చాలా పెద్దగానే ఉంది. 4 స్థానాలకు ఏకంగా సుమారు 25 మందికి పైగా రేసులో ఉన్నారు. దీంతో అభ్యర్థులను ఖరారు చేసేందుకు టీడీపీలో భారీ కసరత్తే నడుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో వణుకు మొదలైందా.. కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా ఉన్నారనే విషయం మరోసారి స్పష్టమైందా. ఎలాగైనా కూటమి అభ్యర్థులను ఓడించాలనే వైసీపీ కుట్రను యువత తిప్పికొట్టారా..
తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్ఠభద్రుల స్థానంలో ప్రసన్న హరికృష్ణ ఎందుకు ఓడిపోయారు. గ్రాడ్యుయేట్లు మద్దతు పలికినప్పటికీ.. ఆయన చేసిన పొరపాటు ఏమిటి. ఆ ఒక తప్పే ఆయన కొంపముంచిందా.. ప్రసన్న హరికృష్ణకు ఎక్కువమంది ఓట్లు వేశామని చెబుతున్నా.. ఎందుకు గెలవలేకపోయారు. ఆ ఒక్క పొరపాటు ఆయనను విజయానికి దూరం చేసిందా..