Share News

AP NEWS: భవానీపురంలో ఓ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నేత.. న్యాయం చేయాలని బాధితుడు ఆందోళన

ABN , First Publish Date - 2023-11-03T18:57:23+05:30 IST

భవానీపురంలో 42వ డివిజన్ వైసీపీ కార్యాలయం ఎదుట సాముల వెంకటేశ్వరరెడ్డి భార్యతో కలిసి ధర్నా చేశారు.

AP NEWS: భవానీపురంలో ఓ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నేత.. న్యాయం చేయాలని బాధితుడు ఆందోళన

విజయవాడ: భవానీపురంలో 42వ డివిజన్ వైసీపీ కార్యాలయం ఎదుట సాముల వెంకటేశ్వరరెడ్డి భార్యతో కలిసి ధర్నా చేశారు. తన స్థలాన్ని కబ్జా చేసి వైసీపీ కార్యాలయం ఏర్పాటు చేశారని ఆందోళనకు దిగారు. 42వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ పగిడిపాటి చైతన్యరెడ్డి, మామ పగిడిపాటి సుబ్బారెడ్డి తన స్థలాన్ని కబ్జా చేశారని ఆందోళన చేపట్టారు. ఆ స్థలం రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా చూపిస్తానని చెప్పారు. అధికార వైసీపీ పార్టీ అయితే కబ్జా చేసేస్తారా ? పార్టీ పెద్దలు తన స్థలాన్ని ఇప్పించాలి. అడిగితే మమ్ములను చంపుతామని సుబ్బారెడ్డి, ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని వెంకటేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-11-03T18:57:24+05:30 IST