Share News

CID Notice: మరోసారి టీడీపీ ఆఫీస్‌కు సీఐడీ నోటీసులు...

ABN , First Publish Date - 2023-11-14T15:42:55+05:30 IST

Andhrapradesh: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. పార్టీ ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. మంగళవారం టీడీపీ కార్యాలయానికి సీఐడీ కానిస్టేబుల్ వచ్చి.. కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసులు ఇచ్చి వెళ్లారు.

CID Notice: మరోసారి టీడీపీ ఆఫీస్‌కు సీఐడీ నోటీసులు...

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍కు (TDP Office) సీఐడీ నోటీసులు (CID Notice) జారీ చేసింది. పార్టీ ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. మంగళవారం టీడీపీ కార్యాలయానికి సీఐడీ కానిస్టేబుల్ వచ్చి.. కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఈనెల 18లోగా వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. స్కిల్ కేసుకు సంబంధించి పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాలకు సంబంధించిన వివరాలు కావాలంటూ సీఐడీ నోటీసుల్లో కోరింది. కాగా.. ఇప్పటికే పార్టీ కార్యాలయానికి సీఐడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పార్టీకి సంబంధించి విరాళాలను అడగడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. సీఐడీ అధికారులు వేధిస్తున్నారంటూ హైకోర్టులో (AP High Court) టీడీపీ పిటిషన్‌ వేసింది. ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణలో దశలో ఉండగానే సీఐడీ మరోసారి టీడీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ నోటీసులపై న్యాయనిపులతో సంప్రదించి ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై టీడీపీ నేతలు యోచినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-11-14T15:44:38+05:30 IST