Payyavula Keshav: జగన్‌పై పయ్యావుల కేశవ్‌ హాట్‌కామెంట్స్..

ABN , First Publish Date - 2023-02-25T19:17:15+05:30 IST

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSR Congress Party President), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై టీడీపీ (TDP) సీనియర్ నేత (పయ్యావుల కేశవ్‌ Payyavula Keshav) హాట్‌కామెంట్స్ చేశారు.

Payyavula Keshav: జగన్‌పై పయ్యావుల కేశవ్‌ హాట్‌కామెంట్స్..

అనంతపురం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSR Congress Party President), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై టీడీపీ (TDP) సీనియర్ నేత (పయ్యావుల కేశవ్‌ Payyavula Keshav) హాట్‌కామెంట్స్ చేశారు. ప్రజలపై జగన్‌ రూ.50 వేల కోట్ల విద్యుత్‌ భారం మోపారని, 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దోపిడీ చేస్తున్నారని పయ్యావుల కేశవ్‌ విమర్శించారు.

బహిరంగ మార్కెట్‌లో రూ.12,200 కోట్లకు విద్యుత్ కొనుగోలు చేశారని, డిస్కంల సరాసరి రేటు కంటే రూ. 4.75 అదనంగా పెట్టి కొన్నారని ఆయన ఆరోపించారు. దీంతో ఏపీకి రూ.6,000 కోట్ల నష్టం కలిగించారని పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. జగన్‌రెడ్డి పాలనలో డిస్కంల అప్పు రూ.31,981 కోట్లు పెరిగిందని, ఒక్క యూనిట్ అదనపు విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదని, అస్మదీయులకు లబ్ధిచేకూర్చడానికే సర్కార్‌ అప్పులు చేస్తోందని పయ్యావుల ఆరోపించారు.

Updated Date - 2023-02-25T19:21:27+05:30 IST