MVV Satyanarayana: కిడ్నాప్‌ను కూడా రాజకీయం చేస్తున్నారు.. ఎంపీ రఘురామపై ఎంవీవీ ఫైర్

ABN , First Publish Date - 2023-06-21T14:52:45+05:30 IST

ఎంపీ రఘురామకృష్ణరాజుపై మరో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రఘురామకృష్ణ గజ్జి కుక్క అని.. ఇష్టం వచ్చినట్లు ఢిల్లీ నుంచి మాట్లాడుతారని మండిపడ్డారు. ఎంపీ కొడుకుని, భార్యని 50 గంటల బంధించి, హింసిస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ మీద 13 కేసు, రాజేష్ మీద 45 కేసులు ఉన్నాయని తెలిపారు.

MVV Satyanarayana: కిడ్నాప్‌ను కూడా రాజకీయం చేస్తున్నారు.. ఎంపీ రఘురామపై ఎంవీవీ ఫైర్

విశాఖపట్నం: ఎంపీ రఘురామకృష్ణరాజుపై (MP Raghuramkrishna raju) మరో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ (MP MVV Satyanarayana) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రఘురామకృష్ణ గజ్జి కుక్క అని.. ఇష్టం వచ్చినట్లు ఢిల్లీ నుంచి మాట్లాడుతారని మండిపడ్డారు. ఎంపీ కొడుకుని, భార్యని 50 గంటల బంధించి, హింసిస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ మీద 13 కేసు, రాజేష్ మీద 45 కేసులు ఉన్నాయని తెలిపారు. హేమంత్‌తో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని.. కేవలం డబ్బులు కోసం ఇదంతా చేశారని చెప్పారు. అనుమానం ఉంటే తన కాల్ డేటా ఐదు సంవత్సరాలు చెక్ చేసుకోవాలన్నారు. అందరూ కోరుతున్నారు కాబట్టి ఘటనపై సీబీఐ (CBI), ఎన్ఐఏ (NIA) ఎంక్వైయిరీ వేయాలని తానే స్వయంగా కోరుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు లేవని చెప్పలేదన్నారు. తాను రాజకీయాల్లో ఉండడంతో ప్రతిదీ వక్రీకరిస్తున్నారని, తెలంగాణలో వ్యాపారం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నా ప్రాజెక్టుని పూర్తి చేస్తామన్నారు. ఈ ఘటనలో ఏ పార్టీకి, ఎవరికి, ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం డబ్బులు కోసమే ఇదంతా చేశారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వెల్లడించారు.

Updated Date - 2023-06-21T14:52:45+05:30 IST