Share News

Woman: ఛీ.. ఛీ.. ఈమె అసలు తల్లేనా..? కన్న కూతురిపై తన ప్రియుడు అత్యాచారం చేస్తున్నాడని తెలిసినా..!

ABN , First Publish Date - 2023-11-28T14:00:19+05:30 IST

Woman sentenced: కేరళలో అమానుష ఘటన వెలుగుచూసింది. కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి.. తన కళ్ల ముందే ఆమెపై దారుణం జరుగుతున్నా చూసి ఉరుకుంది. కన్న కూతురిపై తన ప్రియుడు అత్యాచారం చేస్తున్నాడని తెలిసినా.. ఏమీ చెప్పలేదు.

Woman: ఛీ.. ఛీ.. ఈమె అసలు తల్లేనా..? కన్న కూతురిపై తన ప్రియుడు అత్యాచారం చేస్తున్నాడని తెలిసినా..!

Woman sentenced: కేరళలో అమానుష ఘటన వెలుగుచూసింది. కన్నకూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లి.. తన కళ్ల ముందే ఆమెపై దారుణం జరుగుతున్నా చూసి ఉరుకుంది. కన్న కూతురిపై తన ప్రియుడు అత్యాచారం చేస్తున్నాడని తెలిసినా.. ఏమీ చెప్పలేదు. తాజాగా ఈ కేసు తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు రాగా.. న్యాయస్థానం ఆ తల్లికి 40ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే రూ.20వేల జరిమానా కూడా విధించింది. ఒకవేళ ఫైన్ చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలులో ఉండాలని కోర్టు ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే.. ఈ దారుణ కాండ 2018 మే నుంచి 2019 సెప్టెంబర్ మధ్య జరిగింది. మానసికస్థితి సరిగ్గాలేని భర్తను వదిలిపెట్టి తన 7ఏళ్ల కూతురిని తీసుకుని ఓ మహిళ మరో వ్యక్తితో కలిసి ఉండసాగింది. అతని పేరు శిశుపాలన్. ఈ క్రమంలో అతని కన్ను ఏడేళ్ల చిన్నారిపై పడింది. దాంతో పలుమార్లు చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాపం.. ఆ బాలిక తనపట్ల జరుగుతున్న దారుణాన్ని తల్లికి చెప్పింది. కానీ, ఆమె తన ప్రియుడిని ప్రశ్నించాల్సింది పోయి, కూతురిని ఈ విషయం బయట చెప్పొద్దని బెదిరించింది. ఇంకేముంది ఆ కీచకుడి ఆకృత్యాలకు అడ్డుఅదుపులేకుండా పోయాయి.

Indigo Big Update: టికెట్ బుకింగ్ కోసం ఇండిగో ఏఐ చాట్‌బాట్‌ సర్వీస్.. తెలుగులోనూ సేవలు.. అసలు ఇది ఎలా పని చేస్తుందంటే..!


ఈ క్రమంలో వారి ఇంటికి చుట్టంగా వచ్చిన మరో 11 ఏళ్ల బాలికపై కూడా శిశుపాలన్ అత్యాచారానికి ఒడిగట్టాడు. అయితే, బాధిత బాలిక తిరిగి తన అమ్మమ్మ దగ్గరికి వెళ్లిన తర్వాత విషయాన్ని ఆమెతో చెప్పింది. దాంతో ఆ పెద్దావిడ వెంటనే తన కూతురికి ఫోన్ చేసి, శిశుపాలన్‌కు దూరంగా ఉండాలని చెప్పింది. కానీ, ఆమె తల్లిమాట వినిపించుకోలేదు. ఈ క్రమంలో కొన్నిరోజుల తర్వాత తనంతటతానే అతనికి దూరమైంది. అనంతరం మరో వ్యక్తితో కలిసి జీవించసాగింది. అతడు కూడా ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తల్లికి తెలిసిన ఏమీ చెప్పకపోవడం శోచనీయం.

చివరికి ఆ చిన్నారి పట్ల జరుగుతున్నా దారుణం ఆమె నాన్నమ్మ దృష్టికి వెళ్లింది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు శిశుపాలన్, బాధిత బాలిక తల్లి, ఆమె రెండో ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. చిన్నారికి వైద్యం, కౌన్సిలింగ్ తర్వాత స్థానికంగా ఉండే చిల్డ్రన్ హోంకు తరలించారు. తాజాగా ఈ కేసు తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో కన్నకూతురిపట్ల కర్కశంగా ప్రవర్తించిన తల్లికి న్యాయస్థానం 40ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Viral News: వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపించిన పాక్ పెద్దాయన.. 65ఏళ్ల వయసులో ఏం చేస్తున్నాడో తెలిస్తే..!

Updated Date - 2023-11-28T14:00:22+05:30 IST