Chennai: అన్నాడీఎంకే మహానాడులో కనిమొళిపై పాట

ABN , First Publish Date - 2023-08-24T11:06:54+05:30 IST

మదురైలో జరిగిన అన్నాడీఎంకే మహానాడులో డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi)ని కించపరిచేలా ఓ పాటను

Chennai: అన్నాడీఎంకే మహానాడులో కనిమొళిపై పాట

- మహిళా కమిషన్‌కు ఫిర్యాదు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): మదురైలో జరిగిన అన్నాడీఎంకే మహానాడులో డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi)ని కించపరిచేలా ఓ పాటను ప్రసారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎంకే మహిళా విభాగం నిర్వాహకులు రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. కనిమొళిని కించపరిచేలా ఉన్న ఆ పాట ప్రస్తుతం ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో ప్రసారమవుతోందని పేర్కొన్నారు. ఈ మేరకు డీఎంకే రాష్ట్ర స్థాయి ప్రచార కమిటీ కార్యదర్శి అన్నానగర్‌ రాణి, సామాజిక ప్రసార మాధ్యమాల ఇన్‌ఛార్జి రత్నా లోకేష్‌ తదితరులు స్థానిక చేపాక్‌లోని మహిళా కమిషన్‌ కార్యాలయానికి వెళ్ళి ఆ కమిషన్‌ అధ్యక్షురాలు ఏఎస్‌ కుమారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కనిమొళి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించే రీతిలో ఉన్న ఆ పాటను ప్రసారం చేసిన అన్నాడీఎంకే నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

nani9.jpg

Updated Date - 2023-08-24T11:06:56+05:30 IST