PM Modi: ఈస్టర్ వేళ ఆనందాలు పంచిన మోదీ

ABN , First Publish Date - 2023-04-09T19:36:15+05:30 IST

ఈస్టర్ (Easter) వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఆనందాలు పంచారు.

PM Modi: ఈస్టర్ వేళ ఆనందాలు పంచిన మోదీ
Prime Minister Narendra Modi visited Delhis Sacred Heart Cathedral Catholic Church

న్యూఢిల్లీ: ఈస్టర్ (Easter) వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఆనందాలు పంచారు. న్యూఢిల్లీలోని సేక్రెడ్ హార్ట్ క్యాథెడ్రాల్ క్యాథలిక్ చర్చ్ (Sacred Heart Cathedral Catholic Church) సందర్శించారు. ప్రధానికి బిషల్ అనిల్ ఖుటోతో (Bishop Anil Khuto) పాటు ఇతర క్రైస్తవ మత పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చర్చ్ ఆవరణలో మోదీతో మొక్క నాటించారు. చర్చ్‌లో క్యాండిల్ వెలిగించడంతో పాటు మోదీ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్లు ఆయనకు బహుమతిని కూడా అందించారు. దేశ ప్రధాని ఒకరు తమ చర్చ్‌కు రావడం ఇదే తొలిసారి అని బిషబ్ అనిల్ తెలిపారు. ప్రధాని రాక తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ప్రధానితో ఫాదర్లు ఫొటోలు దిగారు.

Updated Date - 2023-04-09T19:38:13+05:30 IST