Times Now Navbharat Survey: లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరో తేలిపోయింది

ABN , First Publish Date - 2023-04-21T22:18:31+05:30 IST

లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరో టైమ్స్ నౌ నవభారత్ సర్వే తేల్చేసింది.

Times Now Navbharat Survey: లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరో తేలిపోయింది
Times Now Navbharat Survey for Loksabha Elections

న్యూఢిల్లీ: లోక్‌సభకు (Loksabha) ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేది ఎవరో టైమ్స్ నౌ నవభారత్ సర్వే (Times Now Navbharat Survey) తేల్చేసింది. 292 నుంచి 338 సీట్లతో బీజేపీ (BJP) అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి (Congress) 106 నుంచి 144 వరకూ వస్తాయని వెల్లడించింది. పశ్చిమబెంగాల్‌లో టీఎంసీకి (TMC) 20 నుంచి 22, ఒడిశాలో బీజేడీకి(BJD) 11 నుంచి 13 స్థానాలు దక్కుతాయని అంచనావేసింది. ఇతరులు 50 నుంచి 80 స్థానాల్లో గెలుస్తారని తెలిపింది.

నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు బీజేపీకి 282 స్థానాలు దక్కాయి. 2019లో 303 సీట్లలో కమలనాథులు గెలిచారు. 2024 లోక్‌సభలో మరోసారి గెలిచి మూడోసారి కేంద్రంలో పాగావేయాలని మోదీ యోచిస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చేందుకు యత్నిస్తున్నాయి. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికలు పోటీపోటీగా మారబోతున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఈఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలను బట్టి దేశవ్యాప్తంగా ఓటరు నాడి ఎలా ఉంటుందో తేలిపోతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2023-04-21T23:39:32+05:30 IST