Dubai fire: దుబాయి అగ్ని ప్రమాదంలో చనిపోయిన ఇద్దరికి భారీ పరిహారం..!

ABN , First Publish Date - 2023-04-18T20:48:57+05:30 IST

దుబాయిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో (Massive Fire Accident in Dubai) మరణించిన ఇద్దరు భారతీయుల ఫ్యామీలకు తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu) రూ.10లక్షల పరిహారం ప్రకటించింది.

Dubai fire: దుబాయి అగ్ని ప్రమాదంలో చనిపోయిన ఇద్దరికి భారీ పరిహారం..!

దుబాయి: దుబాయిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో (Massive Fire Accident in Dubai) మరణించిన ఇద్దరు భారతీయుల ఫ్యామీలకు తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu) రూ.10లక్షల పరిహారం ప్రకటించింది. శనివారం దుబాయిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు తమిళనాడు వాసులు చనిపోయారనే వార్త తెలిసి చాలా బాధపడ్డానని సీఎం స్టాలిన్ (CM Stalin) తెలిపారు. యూఏఈలోని భారత ఎంబసీ (Indian Embassy) మృతదేహాలను తమిళనాడుకు తరలించే ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. కాగా, అల్ రాస్‌లోని నివాస సముదాయంలో చెలరేగిన మంటల్లో ఇమామ్ కాసీం, మహ్మద్ రఫీక్ సహా 16 మంది చనిపోయారు.

మరోవైపు మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేసిన దుబాయిలోని భారత కాన్సులేట్ (Indian Consulate).. మృతదేహాలను స్వదేశానికి తరలించింది. ఇదే దుర్ఘటనలో మరో ఇద్దరు భారతీయులు (Indians) కూడా మృతిచెందారు. దుబాయిలో టీచర్‌గా పనిచేస్తున్న కేరళ రాష్ట్రం (Kerala) మలప్పురం వాసి జేషీ కందమంగళత్, ఆమె భర్త రిజేష్ కలంగదన్ దంపతులు కూడా ఇదే ప్రమాదంలో చనిపోయారు. ఇప్పటికే వీరి మృతదేహాలను స్వదేశానికి తరలించినట్లు ఇండియన్ ఎంబసీ వెల్లడించింది.

NRI Abducted: ఎన్నారై వ్యాపారవేత్త అపహరణ.. 10 రోజుల తర్వాత ఆచూకీ లభ్యం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..


Updated Date - 2023-04-18T20:49:15+05:30 IST