Indian Students: హ్యూస్టన్‌ వర్సిటీలో సత్తా చాటిన భారతీయ విద్యార్థులు.. మెరిసిన తెలుగమ్మాయి

ABN , First Publish Date - 2023-08-31T06:33:37+05:30 IST

హ్యూస్టన్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న నలుగురు భారత సంతతి విద్యార్థులు ఈ ఏడాది చెవ్రన్‌ గ్రాడ్యుయేట్‌ ఎనర్జీ ఫెలోషి‌ప్‌నకు ఎంపికయ్యారు.

Indian Students: హ్యూస్టన్‌ వర్సిటీలో సత్తా చాటిన భారతీయ విద్యార్థులు.. మెరిసిన తెలుగమ్మాయి

హ్యూస్టన్‌ వర్సిటీలో మెరిసిన భారతీయ విద్యార్థులు

తెలుగు అమ్మాయి సహా నలుగురికి చెవ్రన్‌ ఫెలోషిప్‌

హ్యూస్టన్‌, ఆగస్టు 30: హ్యూస్టన్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న నలుగురు భారత సంతతి విద్యార్థులు ఈ ఏడాది చెవ్రన్‌ గ్రాడ్యుయేట్‌ ఎనర్జీ ఫెలోషి‌ప్‌నకు ఎంపికయ్యారు. వీరిలో తెలుగమ్మాయి మేఘన ఇడమకంటి కూడా ఉన్నారు. మిగతా ముగ్గురు అపరాజిత దత్తా, చిరాగ్‌ గోయల్‌, స్వప్నిల్‌ శర్మ. ఇంధన రంగంలో చురుగ్గా పరిశోధనలు చేస్తున్న మొత్తం 8 మందిని ఎంపిక చేయగా నలుగురు భారత సంతతి వారే కావడం విశేషం. చెవ్రన్‌ ప్రముఖ ఇంధన సంస్థ. ఈ ఫెలోషిప్‌ కింద ఆ సంస్థ ఒక్కొక్కరికి ఏడాదికి 12 వేల డాలర్ల (సుమారు రూ.9 లక్షల 91 వేలు) చొప్పున ఇస్తుంది. అంతేకాక పరిశోధనల్లో ఆ సంస్థలోని నిపుణుల సహాయ సహకారాలు లభిస్తాయి.

Updated Date - 2023-08-31T06:33:37+05:30 IST