ఛీ..ఛీ.. వీళ్లసలు మనుషులేనా..? ఇంట్లో పనిచేసే 14 ఏళ్ల బాలికకు నరకం చూపించారు.. డస్ట్‌బిన్‌లో పడేసిన అన్నాన్ని..

ABN , First Publish Date - 2023-02-11T16:20:30+05:30 IST

కొందరు సమాజం దృష్టిలో మంచి వాళ్లలా కనిపించినా.. ఇంటికి వెళ్లగానే రాక్షసులుగా మారిపోతుంటారు. వారి శాడిజాన్ని మొత్తం కుటుంబ సభ్యులపై చూపిస్తుంటారు. కొందరి శాడిజం చూస్తే.. ఛీఛీ వీళ్లు అసలు మనుషులేనా అని అనిపిస్తుంటుంది. తాజాగా..

ఛీ..ఛీ.. వీళ్లసలు మనుషులేనా..? ఇంట్లో పనిచేసే 14 ఏళ్ల బాలికకు నరకం చూపించారు.. డస్ట్‌బిన్‌లో పడేసిన అన్నాన్ని..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు సమాజం దృష్టిలో మంచి వాళ్లలా కనిపించినా.. ఇంటికి వెళ్లగానే రాక్షసులుగా మారిపోతుంటారు. వారి శాడిజాన్ని మొత్తం కుటుంబ సభ్యులపై చూపిస్తుంటారు. కొందరి శాడిజం చూస్తే.. ఛీఛీ వీళ్లు అసలు మనుషులేనా అని అనిపిస్తుంటుంది. తాజాగా, హర్యానాలో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఇంట్లో పని చేసే 14 ఏళ్ల బాలికు ఆ దంపతులు నరకం చూపించారు. వీరి గురించి తెలుసుకున్న నెటిజన్లు.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే..

హర్యానాకు (Haryana) సమీపంలోని గురుగ్రామ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన మనీష్ కౌర్, కమల్‌జీత్ కౌర్ దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. ఈ దంపతులు (couple) స్థానికంగా ఉన్న పెద్ద ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగ రీత్యా బిజీబిజీగా ఉండడం వల్ల వారి పాప యోగక్షేమాలను చూసుకునేందుకు కేర్ టేకర్ (Care taker) కోసం వెతికేవారు. ఈ క్రమంలో 14 ఏళ్ల బాలిక (14 year old girl) గురించి తెలుసుకుని పిలిపించుకున్నారు. సదరు బాలిక వారి పాపను చూసుకోవడమే కాకుండా ఇంటి పనులు కూడా చేస్తూ ఉండేది. అయితే ఇటీవల ఈ దంపతులు మరీ శాడిస్టులుగా మరిపోయారు. బాలికను చీటికీమాటికీ చిత్రహింసలకు (Torture) గురి చేసేవారు. అంతటితో ఆగకుండా ఇనుప కడ్డీ కాల్చి.. బాలికకు వాతలు కూడా పెట్టేవారు. కనీసం భోజనం కూడా సక్రమంగా పెట్టేవారు కాదు. కొన్నాసార్లు డస్ట్‌బిన్‌లో పడేసిన అన్నాన్ని కూడా తినిపించేవారు.

రెండేళ్ల క్రితం పెళ్లి.. నేరుగా స్టేషన్‌కు వెళ్లిన భార్య.. భర్త గురించి ఆమె చెప్పిన నిజాలు విని అవాక్కైన పోలీసులు..

couples-crime.jpg

సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం లేకపోవడంతో పాపం.. అలాగే భరిస్తూ వచ్చింది. ఈ దంపతులు శాడిజం ఎలా ఉండేదంటే.. ఆహారం దొంగిలించిందనే నేరం మోపి, కొన్ని వారాలు అసలు భోజనమే పెట్టేవారు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో బాలిక.. చెత్త బుట్టలో పడేసిన అన్నం తింటూ ప్రాణాలను నిలుపుకొనేది. అయితే ఇటీవల ఆ దారుణాలు బయటికి తెలియడంతో స్వచ్ఛంద సంస్థలు (Voluntary organizations) స్పందించాయి. బాలికను రక్షించి, సదరు దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక శరీరంపై ఉన్న గాయాలు (Injuries) చూసి చివరకు పోలీసులే చలించిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవడంతో, ప్రైవేట్ సంస్థ యాజమాన్యం.. దంపతులను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: హాయిగా పడుకుందామని బెడ్ వద్దకు వెళ్లాడు.. అనుమానం రావడంతో.. పరుపు ఎత్తి చూసి ఖంగుతిన్నాడు..

Updated Date - 2023-02-11T16:20:35+05:30 IST