Home » Haryana
మీరట్లో నేవీ ఆఫీసర్ మర్డర్ కేసు దేశంలో సంచలనం సృష్టించింది. దాంతో పాటు మరో కొత్త సమస్యను కూడా తెర మీదకు తెచ్చినట్లు అర్థం అవుతోంది. వివాహేర బంధంలో ఉన్న వారు ఇప్పుడు మీరట్ దారుణాన్ని వాడుకుంటున్నారా. వివాహేతర బంధం గురించి భాగస్వామి ప్రశ్నిస్తే.. మీకు కూడా మీరట్ అధికారి గతే పట్టాలా అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఆ వివరాలు..
కలలు కన్న ఉద్యోగం సాధించాడు.. జీవితంలో సెటిల్ అయ్యాడని భావించిన తల్లిదండ్రులు అతడికి వివాహం నిశ్చియించారు. పది రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగింది.. మరి కొద్ది నెలల్లో పెళ్లి. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఫైటర్ జెట్ కుప్పకూలిన ప్రమాదంలో కన్నుమూశాడా యువకుడు. ఆ వివరాలు..
అరెస్టుల సమయంలో పోలీసులు హద్దులు దాటొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుల హక్కులను గౌరవించాల్సిన బాధ్యత డీజీపీలదని తెలిపింది
అద్దెకు వచ్చిన వ్యక్తి.. తన భార్యతో వివాహేతర బంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్న వ్యక్తి.. దారుణానికి ఒడిగట్టాడు. తన భార్యతో రిలేషన్ పెట్టుకున్న వ్యక్తిని బతికుండగానే పూడ్చి పెట్టాడు.
ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్కు పిలిచారు. వారిని ఓ గదిలో కూర్చోబెట్టారు. అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. భార్యకు కోపం వచ్చింది. భర్తపై దాడికి దిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఓ వ్యక్తి తన అత్త భూమిని కొనుగోలు చేశాడని అతనిపై కక్ష్య గట్టాడు. ఆ క్రమంలోనే వారిద్దరికీ మాటా మాట పెరిగి గొడవ పడే స్థాయికి చేరింది. చివరకు ఆ వ్యక్తిపై కాల్పులు జరిపి హత్య చేశాడు.
శిక్షణా కార్యక్రమంలో భాగంగా అంబాలా ఎయిర్బేస్ నుంచి బయలుదేరిన విమానం కొద్ది సేపటికే కుప్పకూలింది. అయితే పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై శాఖాపరమైన దర్యాప్తు జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
ఫరిదాబాద్లో అరెస్టయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్కు చెందిన 19 ఏళ్ల అబ్దుల్ రెహ్మాన్గా గుర్తించారు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్లను నిర్వీర్వం చేశారు.
ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ గత ఎన్నికల్లో తనను అంబాలా కంటోన్మెంట్ సీటులో ఓడించేందుకు కుట్ర పన్నారని అనిల్ విజ్ ఇటీవల ఆరోపించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి చిత్ర సార్వరపై అనిల్ విజ్ 7 వేల ఆధిక్యంతో ఆ ఎన్నికల్లో గెలిచారు.
యమునా జలాల్లో "విషం'' కలపడం ద్వారా ఢిల్లీ ప్రజలను హతమార్చాలని చూస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై హర్యానా కోర్టు బుధవారంనాడు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.