Womens Premier League: ఢిల్లీపై టాస్ గెలిచిన ఆర్సీబీ

ABN , First Publish Date - 2023-03-05T15:39:53+05:30 IST

మహిళ ప్రీమియర్ లీగ్ (WPL) తొలి సీజన్‌లో రెండో మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఢిల్లీ కేపిటల్స్‌తో

 Womens Premier League: ఢిల్లీపై టాస్ గెలిచిన ఆర్సీబీ

ముంబై: మహిళ ప్రీమియర్ లీగ్ (WPL) తొలి సీజన్‌లో రెండో మ్యాచ్ ప్రారంభమైంది. ఢిల్లీపై టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఢిల్లీ కేపిటల్స్‌(Delhi Capitals)కు మెగ్ లానింగ్(Meg Lanning), బెంగళూరు జట్టుకు స్మృతి మంధాన(Smriti Mandhana) సారథ్యం వహిస్తున్నారు. నిన్న గుజరాత్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఆల్‌రౌండర్ ప్రతిభతో అదరగొట్టిన ముంబై ఇండియన్స్ 143 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఢిల్లీ కేపిటల్స్: షెఫాలీ వర్మ, మెగ్ లానింగ్ (కెప్టెన్), మరిజానే కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలీస్ కాప్సీ, జెస్ జోనాసెన్, తానియా భాటియా (వికెట్ కీపర్), అరుంధతి రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, హెదర్ నైట్, దిశా కసత్, ఎల్లిస్ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), కనిక అహుజ, ఆశా శోభన, ప్రీతి బోస్, మెగాన్ షట్, రేణుక ఠాకూర్ సింగ్

Updated Date - 2023-03-05T15:42:37+05:30 IST