IND vs WI 2nd ODI: టాస్ గెలిచిన వెస్టిండీస్.. రోహిత్, కోహ్లీ లేకుండా బరిలోకి భారత్!

ABN , First Publish Date - 2023-07-29T18:51:25+05:30 IST

రెండో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడడం లేదు. వీరిద్దరికి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించారు. దీంతో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు.

IND vs WI 2nd ODI: టాస్ గెలిచిన వెస్టిండీస్.. రోహిత్, కోహ్లీ లేకుండా బరిలోకి భారత్!

బార్బడోస్: రెండో వన్డేలో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదటగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడడం లేదు. వీరిద్దరికి ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించారు. దీంతో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు. రోహిత్, కోహ్లీ స్థానాల్లో ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్, అక్షర్ పటేల్ బరిలోకి దిగుతున్నారు. ‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నిరంతరాయంగా క్రికెట్ ఆడుతున్నారు. అందుకే ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు. మూడో వన్డేలో ఫ్రెష్‌గా బరిలోకి దిగుతారు.’’ అని టాస్ సమయంలో ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా తెలిపాడు. అటు అతిథ్య వెస్టిండీస్ కూడా ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. తొలి వన్డే ఆడిన పావెల్, డ్రేక్స్ స్థానాల్లో అల్జారీ, కీసీని తుది జట్టులోకి తీసుకుంది. కాగా మొదటి వన్డే మ్యాచ్ గెలిచిన టీమిండియా సిరీస్‌లో 1-0తో అధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.


వెస్టిండీస్ తుది జట్టు

బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథానాజ్, షాయ్ హోప్(వికెట్ కీపర్/కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్

టీమిండియా తుది జట్టు

శుభమన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్

Updated Date - 2023-07-29T18:59:11+05:30 IST