Aravind: కాళేశ్వరంతో 80 వేల కోట్ల ప్రజాధనం వృథా
ABN , First Publish Date - 2023-11-04T16:38:25+05:30 IST
కాళేశ్వరం ప్రాజెక్ట్ ( Kaleshwaram Project ) తో 80 వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందని నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల అభ్యర్థి ధర్మపురి అరవింద్ ( Dharmapuri Arvind ) అన్నారు.
జగిత్యాల: కాళేశ్వరం ప్రాజెక్ట్ ( Kaleshwaram Project ) తో 80 వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందని నిజామాబాద్ ఎంపీ, కోరుట్ల అభ్యర్థి ధర్మపురి అరవింద్ ( Dharmapuri Arvind ) అన్నారు. శనివారం నాడు కోరుట్ల పట్టణంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అరవింద్ మీడియాతో మాట్లాడుతూ..‘‘ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల డ్యామ్లలో క్వాలిటి లేదు. వీటిపై కేంద్ర బృందం నివేదిక ఇచ్చింది. రైతులంతా బీజేపీ పార్టీకి అండగా ఉండాలి. భగీరథ నీళ్లు ఎరుపు రంగులో వస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి నర్సింగరావు నన్ను కలిసిండు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు నర్సింగరావుకు ఉన్నాయి. కోరుట్లలో కేసీఆర్ అభ్యర్థి నర్సింగరావే..కేసీఆర్ గోర్లు, రేవంత్రెడ్డి బర్లు మింగేటోళ్లు వాళ్లతో ఈ ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలి’’ అని అరవింద్ పేర్కొన్నారు.