Share News

TS News : వేములవాడలో వీడిన బీజేపీ టికెట్ టెన్షన్.. నామినేషన్ వేసిన అభ్యర్థిని కాదని..

ABN , First Publish Date - 2023-11-10T13:30:55+05:30 IST

Telangana Elections : వేములవాడ బీజేపీలో టికెట్ టెన్షన్ వీడింది. తొలుత ఈటల రాజేందర్ అనుచరురాలు తుల ఉమను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బీజేపీ ఎంపీ బండి సంజయ్ వికాస్ రావుకు టికెట్ కేటాయించాలనడంతో బీజేపీ అధిష్టానం సందిగ్ధంలో పడిపోయింది. నేడు మొత్తానికి టెన్షన్ అయితే వీడింది.

TS News : వేములవాడలో వీడిన బీజేపీ టికెట్ టెన్షన్.. నామినేషన్ వేసిన అభ్యర్థిని కాదని..

రాజన్న సిరిసిల్ల : వేములవాడ బీజేపీలో టికెట్ టెన్షన్ వీడింది. తొలుత ఈటల రాజేందర్ అనుచరురాలు తుల ఉమను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే బీజేపీ ఎంపీ బండి సంజయ్ వికాస్ రావుకు టికెట్ కేటాయించాలనడంతో బీజేపీ అధిష్టానం సందిగ్ధంలో పడిపోయింది. నేడు మొత్తానికి టెన్షన్ అయితే వీడింది. కాసేపట్లో బీజేపీ అభ్యర్థి వికాస్ రావు నామినేషన్ వేయనున్నారు. ముందు తుల ఉమను బీజేపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించి.. చివరి రోజు నిర్ణయాన్ని మార్చుకోవడంతో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే ఆ స్థానం నుంచి తుల ఉమ నామినేషన్ కూడా వేసేశారు. అయితే తాజాగా వికాస్‌రావుకు బీజేపీ ఎంపీ బండి సంజయ్ బీఫామ్ ఇవ్వడం గమనార్హం. వికాస్‌రావు టికెట్‌పై బండి సంజయ్ గట్టిగా పట్టుబట్టడంతో అధిష్టానం మార్పు చేయక తప్పలేదు.

Updated Date - 2023-11-10T14:37:50+05:30 IST