Share News

Congress : సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు

ABN , First Publish Date - 2023-11-22T21:13:10+05:30 IST

సీఈఓ వికాస్ రాజ్‌ ( CEO Vikas Raj ) ను కాంగ్రెస్ నేతలు కలిశారు. మంథని సెగ్మెంట్‌లో కాంగ్రెస్ నాయకులపై దాడి గురించి టీ - కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఫిర్యాదు చేశారు.

Congress :  సీఈఓ వికాస్ రాజ్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్: సీఈఓ వికాస్ రాజ్‌ ( CEO Vikas Raj ) ను కాంగ్రెస్ నేతలు ( Congress Leaders ) కలిశారు. మంథని సెగ్మెంట్‌లో కాంగ్రెస్ నాయకులపై దాడి గురించి టీ - కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఫిర్యాదు చేశారు. మంథని సెగ్మెంట్‌లో పోలీసులు బీఆర్ఎస్‌ పార్టీకి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలు శాంతియతంగా జరిగేందుకు సెన్సిటివ్ ప్రాంతంగా గుర్తించి అదనపు బలగాలను పంపాలని కోరాం. అమర వీరుల ద్వీపం దగ్గర కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూలో పాల్గొనడం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనే అవుతుంది. ప్రభుత్వ స్థలంలో మంత్రి, ఎమ్మెల్సీ ఇంటర్వ్యూ చేస్తే గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. రుణమాఫీ మరో వారంలో వేస్తామని, లేకపోతే నేనే డబ్బులు ఇస్తానన్న కౌశిక్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

Updated Date - 2023-11-22T21:13:14+05:30 IST