Amit Shah: గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా

ABN , First Publish Date - 2023-08-27T15:23:37+05:30 IST

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానశ్రయంలో ఆయనకు పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు.

Amit Shah: గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానశ్రయంలో ఆయనకు పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్వాగతం పలికారు. అనంతరం అమిత్ షా హెలికాప్టర్‌లో ఖమ్మం సభకు బయలుదేరారు. రైతు గోస.. బీజేపీ భరోసా బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సభలోనే అమిత్ షా రైతు డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. అయితే ఈ సభలో అమిత్ షా ఏం మాట్లాడబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తన ప్రసంగంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అమిత్ షా టార్గెట్ చేస్తారా? లేదా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


కాగా ఆదివారం ఖమ్మంలో బీజేపీ (BJP) బహిరంగ సభ నిర్వహించతలపెట్టింది. ఈ సభకు హాజరవుతున్న కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఖమ్మం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. మరో మూడు నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో రాజకీయాలు రంజుగా మారాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా సభను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను వడబోస్తున్న నేపథ్యంలో ఆదివారం జరగబోయే సభలో అమిత్ షా ఏం మాట్లాడుతారు? ఏమైనా కీలక ప్రకటనలు చేస్తారా?.. బీజేపీలోకి కొత్తగా ఏమైనా చేరికలు ఉంటాయా? అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2023-08-27T15:26:04+05:30 IST