TS NEWS: రాజేంద్రనగర్‌లో రన్నింగ్ కారులో మంటలు..

ABN , First Publish Date - 2023-09-09T18:22:51+05:30 IST

రాజేంద్రనగర్‌లో(Rajendranagar) రన్నింగ్‌లో ఉన్న ఓ కారులో నుంచి మంటలు వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

TS NEWS:  రాజేంద్రనగర్‌లో రన్నింగ్ కారులో మంటలు..

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్‌లో(Rajendranagar) రన్నింగ్‌లో ఉన్న ఓ కారులో నుంచి మంటలు వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో నడుస్తున్న షిఫ్ట్ కారులో ఒక్కసారిగా మంటలు చేలరిగాయి. మంటలు అంటుకున్న సమయంలో కారులో ఇద్దరు భార్యభర్తలు ఉన్నారు. వారు మంటలను గమనించి వెంటనే కారును రోడ్డుకు పక్కన ఆపి కారు నుంచి దిగి దూరంగా వెళ్లారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఈ ఘటనపై అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు, వారు సంఘటన స్థలానికి వచ్చి మంటలను పూర్తిగా అర్పివేశారు.

Updated Date - 2023-09-09T18:22:51+05:30 IST