Share News

Mallareddy: రేవంత్ రెడ్డికి ఒకే ఒక్క విజ్ఞప్తి...

ABN , First Publish Date - 2023-12-11T13:32:11+05:30 IST

Telangana: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం యశోదా ఆస్పత్రిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మల్లారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా రెండుమూడు రోజులు తరువాత డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు.

Mallareddy: రేవంత్ రెడ్డికి ఒకే ఒక్క విజ్ఞప్తి...

హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (BRS Chief KCR) తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు మాజీ మంత్రి మల్లారెడ్డి (Former Minister Malla reddy) అన్నారు. సోమవారం యశోదా ఆస్పత్రిలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మల్లారెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా రెండుమూడు రోజుల తరువాత డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ కేసీఆర్ రాష్ట్రాన్ని ఒక మోడల్‌గా తయారు చేశారన్నారు. కేటీఆర్ (KTR) లేని హైదరాబాద్‌ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారన్నారు. రాష్ట్రంలో కూడా అన్ని సదుపాయాలు మెరుగుపడ్డాయన్నారు. లోకల్‌గా ఎమ్మెల్యేకు ఓటు వెయ్యకూడదు అనుకున్నారని.. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఓడిపోతారని జనాలు అనుకోలేదన్నారు. అందుకు అందరూ బాధ పడుతున్నారని తెలిపారు. ‘‘రేవంత్ రెడ్డికి ఒకే ఒక్క విజ్ఞప్తి... రాష్ట్రంలో ఐటీ, రియల్ ఎస్టేట్ రంగాలను కాపాడాలని కోరుతున్నాను’’ అని మాజీ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-12-11T15:20:02+05:30 IST