Khairathabad Ganesh : ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర

ABN , First Publish Date - 2023-09-28T07:23:34+05:30 IST

ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర మొదలైంది. ఉదయం 6 గంటలకే శోభాయాత్ర ప్రారంభమైంది. ఉదయం11 గంటలకు క్రేన్ నెంబర్ 4 కి చేరుకోనున్నాడు.

Khairathabad Ganesh : ప్రారంభమైన ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర

హైదరాబాద్ : ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర మొదలైంది. ఉదయం 6 గంటలకే శోభాయాత్ర ప్రారంభమైంది. ఉదయం11 గంటలకు క్రేన్ నెంబర్ 4 కి చేరుకోనున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు బడా గణేష్ నిమజ్జనం పూర్తికానుంది. ఇక ఆ తరువాత మిగతా వినాయకుల నిమజ్జన కార్యక్రమం జరగనుంది. గతంలో అయితే జంట నగరాల్లోని వినాయక నిమజ్జనం ముగిశాక చివరిలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఉండేది. చివరిలో బడా గణేష్ నిమజ్జనం పెట్టుకుంటే ఇబ్బంది తలెత్తుతోందని ముందుగానే నిర్వహిస్తున్నారు. కాగా.. ఈసారి ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్రలో బ్యాండ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇక బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు సైతం ప్రారంభమైంది.

Updated Date - 2023-09-28T09:36:03+05:30 IST