KTR : పిరమైన ప్రధాని.. మోదీ..

ABN , First Publish Date - 2023-04-05T12:30:55+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఉప్పు, పప్పు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఆయన ఆకట్టుకునే ట్వీట్ చేశారు.

KTR : పిరమైన ప్రధాని.. మోదీ..

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. ఉప్పు, పప్పు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఆయన ఆకట్టుకునే ట్వీట్ చేశారు. ‘‘ఉప్పు పిరం.. పప్పు పిరం.. పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం.. గ్యాస్ పిరం.. గ్యాస్ పై వేసిన దోశ పిరం.. అన్నీ పిరం.. పిరం... జనమంతా గరం... గరం... అందుకే అంటున్నా.. ప్రియమైన ప్రధాని మోదీ కాదు.. “పిరమైన ప్రధాని.. మోదీ..’’ అని తన ట్వీట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు.

ఇక పేపర్ లీక్ ఘటనపై సైతం కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. అంతకు ముందు పేపర్ లీక్ ఘటనలకు సంబంధించిన పోటోలు, వీడియో క్లిప్పింగ్‌లను రీ ట్వీట్ చేసిన కేటీఆర్.. తాజాగా మరో ట్వీట్ చేశారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే.. వచ్చే పోయే వాళ్లకే ప్రమాదమని.. అదే ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమన్నారు. ‘‘పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం...!! కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం...!!! తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపీ నాయకులు’’ అంటూ ట్వీట్ చేశారు.

Updated Date - 2023-04-05T12:42:28+05:30 IST