Share News

Minister Sridhar Babu : మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్ట్‌లపై దర్యాప్తు జరిపిస్తాం

ABN , Publish Date - Dec 17 , 2023 | 04:26 PM

కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారంలో జరిగిన లోపాలపై దర్యాప్తు జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) తెలిపారు.

Minister Sridhar Babu : మేడిగడ్డ, అన్నారం  ప్రాజెక్ట్‌లపై దర్యాప్తు జరిపిస్తాం

కరీంనగర్: కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారంలో జరిగిన లోపాలపై దర్యాప్తు జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) తెలిపారు. ఆదివారం నాడు మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ... ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపడుతామని మా మేనిఫెస్టోలోనే పెట్టాం. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. వారి మాటలు ఒకలా, చేతలు మరొకలా ఉంటాయి. తొమ్మిదేళ్లు బీఆర్ఎస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. బీజేపీ నేతలు బీఆర్ఎస్‌పై ఇప్పుడు ఎందుకు విమర్శలు చేస్తున్నారు. ప్రజలు కోరుకున్న మార్పును అన్ని రంగాల్లో చూపిస్తాం’’ అని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 04:27 PM