Share News

TS NEWS: కేసీఆర్‌ని పరామర్శించిన మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ABN , First Publish Date - 2023-12-12T19:28:14+05:30 IST

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ని మంత్రులు దామోదర రాజనర్సింహ ( Damodara Rajanarsimha ) , దుద్దిళ్ల శ్రీధర్ బాబు ( Duddilla Sridhar Babu ) సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... కేసీఆర్‌ని పరామర్శించేందుకు వచ్చాం. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు... బహుశా రెండురోజుల్లో కేసీఆర్ డిశ్చార్జ్ అవుతారని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.

TS NEWS: కేసీఆర్‌ని పరామర్శించిన  మంత్రులు దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ( KCR ) ని మంత్రులు దామోదర రాజనర్సింహ ( Damodara Rajanarsimha ) , దుద్దిళ్ల శ్రీధర్ బాబు ( Duddilla Sridhar Babu ) సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ... కేసీఆర్‌ని పరామర్శించేందుకు వచ్చాం. కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు... బహుశా రెండురోజుల్లో కేసీఆర్ డిశ్చార్జ్ అవుతారని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కేసీఆర్‌ని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నాం. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని కోరాం. స్పీకర్ ఎన్నికలో కూడా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే విధంగా సహకరించాలని కేసీఆర్‌ని కోరాం. కేసీఆర్‌కి ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని అందించాలని కోరాం. అందరూ నాయకులను కలుపుకుని ప్రజలకు మంచి పాలన అందిస్తామని కేసీఆర్‌కి చెప్పాం’’ అని దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

Updated Date - 2023-12-12T19:28:15+05:30 IST