PM Modi: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పులు

ABN , First Publish Date - 2023-09-27T13:32:18+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. అక్టోబర్ 1న మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్న మోదీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంది. బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు బదులుగా ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని రానున్నారు.

PM Modi:  ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్లో స్వల్ప మార్పులు

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra modi) తెలంగాణలో పర్యటించనున్నారు. అక్టోబర్ 1న మహబూబ్‌నగర్ జిల్లాకు రానున్న మోడీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు బదులుగా ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని రానున్నారు. అక్టోబర్ 1న మధ్యాహ్నం 1:30 గంలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మోడీ చేరుకోనున్నారు. 1:35 శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు బయలుదేరి వెళ్లనున్నారు.

  • 2:10 గంటలకు మహబూబ్‌నగర్ హెలిపాడ్ వద్దకు మోడీ చేరుకుంటారు.

  • 2:15 గంటల నుంచి 2:50 వరకు మహబూబ్‌నగర్‌లోనే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు

  • 3:00 గంటలకు బహిరంగ సభ వేదికకు రానున్న మోడీ

  • 4:00 గంటల వరకు బహిరంగ సభ వద్దే నరేంద్ర మోడీ.

  • 4:10 నిమిషాలకు మహబూబ్‌నగర్ నుంచయి ప్రత్యేక హెలికాప్టర్లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు.

  • 4:45 శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని చేరుకోనున్నారు.

  • 4:50 శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో మోదీ తిరిగి ఢిల్లీ వెళ్ళనున్నారు.

Updated Date - 2023-09-27T13:32:18+05:30 IST