Share News

Hyderabad: షీ టీం ఏఎస్ఐ రాజేందర్ రెడ్డి మృతి

ABN , Publish Date - Dec 24 , 2023 | 10:38 AM

హైదరాబాద్: ఈనెల 11వ తేదీన ఎల్బీనగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నాగోల్ ఫ్లైఓవర్‌పై సెల్ఫ్ స్కిడ్ అయి పడిపోయిన ఎల్బీనగర్ షీ టీం ఏఎస్ఐ రాజేందర్ రెడ్డి చికిత్ పొందుతూ రాత్రి మృతి చెందారు.

Hyderabad: షీ టీం ఏఎస్ఐ రాజేందర్ రెడ్డి మృతి

హైదరాబాద్: ఈనెల 11వ తేదీన ఎల్బీనగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నాగోల్ ఫ్లైఓవర్‌పై సెల్ఫ్ స్కిడ్ అయి పడిపోయిన ఎల్బీనగర్ షీ టీం ఏఎస్ఐ రాజేందర్ రెడ్డి చికిత్ పొందుతూ రాత్రి మృతి చెందారు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆయనను అధికారులు షి టీమ్‌కు అటాచ్ చేశారు. అయితే 11న బైక్‌పై వస్తున్న రాజేందర్ రెడ్డి నాగోల్ ఫ్లైఓవర్‌పై సెల్ఫ్ స్కిడ్ అయి పడిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటంబసభ్యులు సుప్రజా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వారం రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా.. ఫలితం లేకకపోవడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు సిటీ న్యూరో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే నిన్న రాత్రి రాజేందర్రెడ్డి తుది శ్వాస విడిచారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Dec 24 , 2023 | 10:38 AM