తెలంగాణలో బీజేపీ ప్రణాళికలు ఇవే.. ప్రధాని టూర్ ఎలా వుండబోతుందంటే..?

ABN , First Publish Date - 2023-04-01T18:45:14+05:30 IST

ఈ నెల 8న నగరానికి ప్రధాని మోదీ (PM Modi) రానున్నాను. తెలంగాణ (Telangana)ను బీజేపీ (BJP) టార్గట్ చేసింది. అయితే నెలకోసారి ప్రధాని హైదరాబాద్ (Hyderabad) రానున్నట్లు తెలిసింది.

తెలంగాణలో బీజేపీ ప్రణాళికలు ఇవే.. ప్రధాని టూర్ ఎలా వుండబోతుందంటే..?

హైదరాబాద్: ఈ నెల 8న నగరానికి ప్రధాని మోదీ (PM Modi) రానున్నాను. తెలంగాణ (Telangana)ను బీజేపీ (BJP) టార్గట్ చేసింది. అయితే నెలకోసారి ప్రధాని హైదరాబాద్ (Hyderabad) రానున్నట్లు తెలిసింది. రానున్న నాలుగు నెలలకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసింది. కర్ణాటక ఎన్నికలు ముగియగానే మరింత తెలంగాణపై దూకుడు పెంచాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ టూర్ ఉండేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మధ్యమధ్యలో పార్లమెంట్ నియోజకవర్గల పరిధిలో కేంద్రమంత్రుల పర్యటనలు కూడ ఉండనున్నట్లు బీజేపీ వర్గాలు అంటున్నాయి.

ఈనెల 8న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మదీ... 700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఒరలింగ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ -తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. మేలో వరంగల్ లేదా సిరిసిల్లలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మెగా టెక్స్ టైల్ పార్కుకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే జూన్‌లో నల్లగొండ పర్యటించనున్నారు. ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేయనున్నారు. తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటన‌లో భాగంగా జాతీయ రహదారులకు శంకుస్థాపన, నిర్మాణం పూర్తి ఐనవి జాతికి అంకితం చేయనున్నారు.

Updated Date - 2023-04-01T18:45:14+05:30 IST